600 దిర్హామ్ జరిమానా? అల్ కూజ్ లోని బస్ లేన్ తొలగింపు..!
- August 21, 2024
దుబాయ్: అల్ కూజ్ లోని ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ వెంబడి ఉన్న ప్రత్యేకమైన బస్ లేన్ను తొలగించినట్లు వాహనదారులు తెలిపారు. ఇప్పుడు ఆ మార్గంలోప్రైవేట్ వాహనాలు వెళుతున్నాయని చెప్పారు., వాహనదారులకు 600 దిర్హామ్ల పెనాల్టీ ఉంటుందని హెచ్చరించే బోర్డులు ఇంకా తొలగించలేదని తమ సోషల్ మీడియా అకౌంట్ లలో గుర్తు చేస్తున్నారు. దీనిపై రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) స్పందించింది. బస్ లేన్ ఒక దిశలో మాత్రమే ఉందని తెలిపింది. అల్ క్వోజ్ బస్ స్టేషన్ నుండి బౌలింగ్ సెంటర్ వరకు జబీల్ వైపు..అల్ మైదాన్ రోడ్, ఖలీద్ బిన్ అల్ వలీద్ రోడ్, నైఫ్ స్ట్రీట్ మరియు అల్ ఘుబైబా రోడ్లలో ప్రత్యేకమైన రెడ్, ఎల్లో లైన్స్ ఇప్పుడు ఉన్నాయని పేర్కొంది.“ఎల్లో లేన్ తాత్కాలికమైనది. ఈ బస్ లేన్ను ఉపయోగించుకోవడానికి తుది నిర్ణయం తీసుకోవడానికి అధ్యయనం కొనసాగుతోంది. మెట్రో స్టేషన్ల మధ్య మెట్రో మూసివేత సమయంలో (ఏప్రిల్ 16న భారీ వర్షాల నేపథ్యంలో) బస్సు లేన్లను ఏర్పాటు చేశాం.
ప్రత్యేక బస్సు మార్గాలను ఉపయోగించి పట్టుబడిన వాహనదారులపై 600 దిర్హామ్ల జరిమానా విధిస్తారు. ఎల్లో లైన్ అంటే పాసింగ్ కాద. వాహనదారుడు ఈ లైన్కు ఎడమ లేదా కుడి వైపునకు నడపకూడదు. డాట్టెడ్ ఎల్లో లైన్ అంటే ఒక డ్రైవర్ లేన్ మార్చడానికి లేదా మరొక వాహనాన్ని అధిగమించడానికి ఉపయోగించవచ్చు.” అని రోడ్సేఫ్టీయూఏఈ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్ గత జూన్ లో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







