600 దిర్హామ్ జరిమానా? అల్ కూజ్ లోని బస్ లేన్ తొలగింపు..!
- August 21, 2024
దుబాయ్: అల్ కూజ్ లోని ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ వెంబడి ఉన్న ప్రత్యేకమైన బస్ లేన్ను తొలగించినట్లు వాహనదారులు తెలిపారు. ఇప్పుడు ఆ మార్గంలోప్రైవేట్ వాహనాలు వెళుతున్నాయని చెప్పారు., వాహనదారులకు 600 దిర్హామ్ల పెనాల్టీ ఉంటుందని హెచ్చరించే బోర్డులు ఇంకా తొలగించలేదని తమ సోషల్ మీడియా అకౌంట్ లలో గుర్తు చేస్తున్నారు. దీనిపై రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) స్పందించింది. బస్ లేన్ ఒక దిశలో మాత్రమే ఉందని తెలిపింది. అల్ క్వోజ్ బస్ స్టేషన్ నుండి బౌలింగ్ సెంటర్ వరకు జబీల్ వైపు..అల్ మైదాన్ రోడ్, ఖలీద్ బిన్ అల్ వలీద్ రోడ్, నైఫ్ స్ట్రీట్ మరియు అల్ ఘుబైబా రోడ్లలో ప్రత్యేకమైన రెడ్, ఎల్లో లైన్స్ ఇప్పుడు ఉన్నాయని పేర్కొంది.“ఎల్లో లేన్ తాత్కాలికమైనది. ఈ బస్ లేన్ను ఉపయోగించుకోవడానికి తుది నిర్ణయం తీసుకోవడానికి అధ్యయనం కొనసాగుతోంది. మెట్రో స్టేషన్ల మధ్య మెట్రో మూసివేత సమయంలో (ఏప్రిల్ 16న భారీ వర్షాల నేపథ్యంలో) బస్సు లేన్లను ఏర్పాటు చేశాం.
ప్రత్యేక బస్సు మార్గాలను ఉపయోగించి పట్టుబడిన వాహనదారులపై 600 దిర్హామ్ల జరిమానా విధిస్తారు. ఎల్లో లైన్ అంటే పాసింగ్ కాద. వాహనదారుడు ఈ లైన్కు ఎడమ లేదా కుడి వైపునకు నడపకూడదు. డాట్టెడ్ ఎల్లో లైన్ అంటే ఒక డ్రైవర్ లేన్ మార్చడానికి లేదా మరొక వాహనాన్ని అధిగమించడానికి ఉపయోగించవచ్చు.” అని రోడ్సేఫ్టీయూఏఈ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్ గత జూన్ లో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









