దుబాయ్ లో పార్ట్టైమ్ జాబ్ స్కామ్.. నలుగురికి జైలు శిక్ష
- August 22, 2024
దుబాయ్ః పార్ట్ టైమ్ జాబ్ స్కామ్లో నలుగురు వ్యక్తులకు దుబాయ్లో మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ ప్రాసిక్యూషన్ నిర్వహించిన దర్యాప్తులో బాధిత మహిళ దృష్టిని ఆకర్షించడానికి ముఠా వాట్సాప్ ద్వారా నకిలీ ఉద్యోగ ప్రకటనను షేర్ చేసినట్టు తేలింది. వారు డబ్బు పంపమని, దానిని త్వరగా డబ్బు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వారు దానిని తిరిగి ఇవ్వలేదని, బాధితురాలిని నమ్మించి మోసం చేశారని అధికారులు చెప్పారు. దుబాయ్లోని మిస్డిమీనర్ కోర్ట్ ఈ ముఠా మోసానికి పాల్పడినట్లు నిర్ధారించి వారిని బహిష్కరించడానికి జైలు శిక్ష విధించింది.సైబర్ స్కామర్ల బారిన పడొద్దని, అలాంటి ప్రకటనలకు స్పందించవద్దని అధికారులు తెలిపారు. అనుమానం ఉంటే నివాసితులు భద్రతా అధికారులను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









