దుబాయ్ లో పార్ట్టైమ్ జాబ్ స్కామ్.. నలుగురికి జైలు శిక్ష
- August 22, 2024
దుబాయ్ః పార్ట్ టైమ్ జాబ్ స్కామ్లో నలుగురు వ్యక్తులకు దుబాయ్లో మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ ప్రాసిక్యూషన్ నిర్వహించిన దర్యాప్తులో బాధిత మహిళ దృష్టిని ఆకర్షించడానికి ముఠా వాట్సాప్ ద్వారా నకిలీ ఉద్యోగ ప్రకటనను షేర్ చేసినట్టు తేలింది. వారు డబ్బు పంపమని, దానిని త్వరగా డబ్బు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వారు దానిని తిరిగి ఇవ్వలేదని, బాధితురాలిని నమ్మించి మోసం చేశారని అధికారులు చెప్పారు. దుబాయ్లోని మిస్డిమీనర్ కోర్ట్ ఈ ముఠా మోసానికి పాల్పడినట్లు నిర్ధారించి వారిని బహిష్కరించడానికి జైలు శిక్ష విధించింది.సైబర్ స్కామర్ల బారిన పడొద్దని, అలాంటి ప్రకటనలకు స్పందించవద్దని అధికారులు తెలిపారు. అనుమానం ఉంటే నివాసితులు భద్రతా అధికారులను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







