ఒమన్ లో ఘనంగా రాజస్థానీ తీజ్ ఉత్సవ్
- August 22, 2024
మస్కట్: ఇండియన్ సోషల్ క్లబ్ (ISC), ఒమన్ రాజస్థానీ వింగ్ ఆధ్వర్యంలో ఆగస్టు 16, 2024న హఫా హౌస్ హోటల్లో సాంప్రదాయ రాజస్థానీ పండుగ శ్రావణ్ ఉత్సవ్ -తీజ్ వేడుకను నిర్వహించింది. రాజస్థానీ కమ్యూనిటీకి చెందిన దాదాపు 80 మంది మహిళలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ సంప్రదాయాలు మరియు సాంస్కృతిక సంపదను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేడుకలలో భాగంగా నిర్వహించారు.
తీజ్ పండుగ అనేది మహిళలకు సంబంధించిన ఒక సాంస్కృతిక పండుగ. దీనిని రాజస్థాన్లో ఘనంగా జరుపుకుంటారు. తమ భర్త మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం రోజంతా ప్రార్థనలు చేస్తారు.ఉపవాసం ఉంటారు. తీజ్ పండుగ ప్రేమ కలయికను మాత్రమే కాకుండా, ప్రకృతిని ఆరాధించే క్రతువుగా భావిస్తారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందించిన వాలంటీర్లను రాజస్థానీ వింగ్ కోఆర్డినేటర్, సుధా పంకజ్ జోషి అభినందించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







