ఒమన్ లో ఘనంగా రాజస్థానీ తీజ్ ఉత్సవ్
- August 22, 2024
మస్కట్: ఇండియన్ సోషల్ క్లబ్ (ISC), ఒమన్ రాజస్థానీ వింగ్ ఆధ్వర్యంలో ఆగస్టు 16, 2024న హఫా హౌస్ హోటల్లో సాంప్రదాయ రాజస్థానీ పండుగ శ్రావణ్ ఉత్సవ్ -తీజ్ వేడుకను నిర్వహించింది. రాజస్థానీ కమ్యూనిటీకి చెందిన దాదాపు 80 మంది మహిళలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ సంప్రదాయాలు మరియు సాంస్కృతిక సంపదను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేడుకలలో భాగంగా నిర్వహించారు.
తీజ్ పండుగ అనేది మహిళలకు సంబంధించిన ఒక సాంస్కృతిక పండుగ. దీనిని రాజస్థాన్లో ఘనంగా జరుపుకుంటారు. తమ భర్త మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం రోజంతా ప్రార్థనలు చేస్తారు.ఉపవాసం ఉంటారు. తీజ్ పండుగ ప్రేమ కలయికను మాత్రమే కాకుండా, ప్రకృతిని ఆరాధించే క్రతువుగా భావిస్తారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందించిన వాలంటీర్లను రాజస్థానీ వింగ్ కోఆర్డినేటర్, సుధా పంకజ్ జోషి అభినందించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









