ఒమన్ లో ఘనంగా రాజస్థానీ తీజ్ ఉత్సవ్
- August 22, 2024
మస్కట్: ఇండియన్ సోషల్ క్లబ్ (ISC), ఒమన్ రాజస్థానీ వింగ్ ఆధ్వర్యంలో ఆగస్టు 16, 2024న హఫా హౌస్ హోటల్లో సాంప్రదాయ రాజస్థానీ పండుగ శ్రావణ్ ఉత్సవ్ -తీజ్ వేడుకను నిర్వహించింది. రాజస్థానీ కమ్యూనిటీకి చెందిన దాదాపు 80 మంది మహిళలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ సంప్రదాయాలు మరియు సాంస్కృతిక సంపదను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేడుకలలో భాగంగా నిర్వహించారు.
తీజ్ పండుగ అనేది మహిళలకు సంబంధించిన ఒక సాంస్కృతిక పండుగ. దీనిని రాజస్థాన్లో ఘనంగా జరుపుకుంటారు. తమ భర్త మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం రోజంతా ప్రార్థనలు చేస్తారు.ఉపవాసం ఉంటారు. తీజ్ పండుగ ప్రేమ కలయికను మాత్రమే కాకుండా, ప్రకృతిని ఆరాధించే క్రతువుగా భావిస్తారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందించిన వాలంటీర్లను రాజస్థానీ వింగ్ కోఆర్డినేటర్, సుధా పంకజ్ జోషి అభినందించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









