ఖలాలీలో బాలికల కొత్త పాఠశాల.. 1,320 మంది విద్యార్థులకు ప్రయోజనం..!
- August 22, 2024
కువైట్: కువైట్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనామిక్ డెవలప్మెంట్ (KFAED) ద్వారా ఖలాలీలో బాలికల కోసం ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాల నిర్మాణం చేపట్టనున్నది. దీనిని విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. పెరుగుతున్న విద్యార్థుల జనాభాకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని MP ఖలీద్ బునాక్ తెలిపారు. దీని కోసం ఖలాలీలో ప్రభుత్వం 12,007 చదరపు మీటర్ల ప్లాట్ను కేటాయించింది. పాఠశాలలో రెండు విద్యా భవనాలు ఉంటాయి. ఒక్కొక్కటి నాలుగు అంతస్తులు. ఒక్కో భవనంలో 22 తరగతి గదులు ఉంటాయి. ఈ పాఠశాలలో దాదాపు 1,320 మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కో తరగతికి 30 మంది విద్యార్థులు ఉంటారు. సైన్స్ ల్యాబ్లు, ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, డిజైన్ మరియు టెక్నాలజీ ల్యాబ్లు, ఆర్ట్ రూమ్ మరియు టీచర్ల రూమ్లు ఉంటాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు