షేక్ హసీనా దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేసిన బంగ్లా ప్రభుత్వం
- August 22, 2024
బంగ్లాదేశ్: ఢాకా: మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్పోర్ట్ను బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. హసీనాతో పాటు ఆమె పార్టీకి చెందిన మాజీ ఎంపీల దౌత్య పాస్పోర్ట్లను కూడా క్యాన్సిల్ చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దౌత్య పాస్పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటును కలిగి ఉంటారు.
ఇక బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల కారణంగా హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఏకంగా దేశాన్ని కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. అలా ఈ నెల 5న బంగ్లాదేశ్ను వీడిన షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు.
ఈ క్రమంలో షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని ఇప్పటికే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత ప్రభుత్వాన్ని కోరింది. బంగ్లాదేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు భారత్ నుంచి ఆమె కుట్ర చేస్తున్నారని ఈ సందర్భంగా బీఎన్పీ ఆరోపించింది. కాగా, నిరసనల్లో చెలరేగిన హింస కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హసీనాపై పదుల సంఖ్యలో హత్య కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె మొత్తంగా 44 కేసులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









