సలాలాలో ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభం
- August 24, 2024
మస్కట్: సలాలాలోని విలాయత్లో హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్, ధోఫర్ ఖరీఫ్ సీజన్ 2024తో కలిసి ప్రారంభమైంది. ఆగస్టు 26 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో అనేక మంది ఒమానీ, గల్ఫ్ చెఫ్ల ప్రత్యక్ష ప్రదర్శనలతో సహా వివిధ కార్యకలాపాలు ఉన్నాయి. అనేక లిటిల్ చెఫ్ కార్నర్, సాంప్రదాయ సంగీత జానపద ప్రదర్శనలు, వివిధ పోటీలు నిర్వహించనున్నారు. సాంప్రదాయ ఒమానీ ఆహారాలను అందించే రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు.
ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్ ఫోరమ్లు, ఫెస్టివల్స్, ఈవెంట్ల ద్వారా స్థానికంగా, ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ టూరిజంను ప్రోత్సహించడం ముఖ్యంగా ఒమానీ పాక కళలు, ఒమానీ వంటకాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమ ఉద్దేశం అని నిర్వాహకులు ప్రకటించారు. ఫెస్టివల్ ప్రారంభ వేడుకను ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రావాస్ స్పాన్సర్ చేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు