'జక్కన్న' టీజర్ పై ఓ లుక్కేయండి

- June 17, 2016 , by Maagulf
'జక్కన్న' టీజర్ పై  ఓ లుక్కేయండి

కృష్ణాష్టమి చిత్రం తర్వాత సునీల్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ 'జక్కన్న'. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కథానాయికగా మన్నారా చోప్రా నటిస్తోంది. సుదర్శన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య సునీల్ కు సరైన హిట్స్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకొని పూర్తి చేస్తాడు సునీల్. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలు పెంచడంతో టీజర్ ని కూడా అదే రేంజ్ లో రెడీ చేసారు. తాజాగా జక్కన్న చిత్ర టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సునీల్ మార్క్ కామెడీని కలిపి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com