'సాహసం శ్వాసగా సాగిపో'' సాంగ్ ట్రైలర్స్ విడుదల..
- June 17, 2016
నాగచైతన్య ,మంజిమ మోహన్ ప్రధాన పాత్రలలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఎ.ఆర్.రెహమాన్ స్వరకర్త గా ఉన్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తుండగా, మిరియాల రవీందర్రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో ఈ చిత్ర పాటలు విడుదల కార్యక్రమం జరిగింది. తొలి సీడీని ప్రముఖ కథానాయకులు నాగార్జున, గోపీచంద్ ఆవిష్కరించారు. ఎ.ఆర్.రెహమాన్ స్వీకరించారు. వి.వి.వినాయక్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ ఇప్పటికీ 'ఏ మాయ చేసావె' పాటలు వెంటాడుతున్నాయి. 'సాహసం శ్వాసగా సాగిపో'తో మరిన్ని అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు ఎ.ఆర్.రెహమాన్గారికి కృతజ్ఞతలు.
ఆయనతో పనిచేసే అవకాశం రెండోసారి ఇప్పించారు గౌతమ్మేనన్. విజయాల్ని అందించిన దర్శకులతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకొంటుంటా. అలాంటి అవకాశం గౌతమ్ మీనన్ తో వచ్చినందుకు ఆనందంగా ఉంది 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఓ గొప్ప ప్రయాణం అని తెలిపాడు చైతూ. ఇక ఈ కార్యక్రమంలో డి.సురేష్బాబు, సాయిధరమ్ తేజ్, రెజీనా, వంశీ పైడిపల్లి, కల్యాణ్కృష్ణ, అనంత శ్రీరామ్, దశరథ్, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆడియో వేడుక సందర్బంగా కొన్ని సాంగ్ ట్రైలర్స్ విడుదల చేసారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







