స్కెంజెన్ దేశాలకు ప్రయాణించే వారి కోసం కొత్త హ్యాండ్-బ్యాగేజీ నిబంధనలు..!
- August 26, 2024
యూఏఈ: సెప్టెంబరు 1 నుండి యూఏఈ నివాసితులు మరియు స్కెంజెన్ దేశాలకు వెళ్లే పర్యాటకులు తమ చేతి సామానులో గరిష్టంగా 100ml ద్రవాన్ని తీసుకెళ్లడానికి అనుమతించనున్నారు. ఈ మేరకు యూరోపియన్ కౌన్సిల్ దీనిని ప్రకటించింది. యూఏఈ నివాసితులలో స్కెంజెన్ దేశాలు పర్యాటకం , వ్యాపార పర్యటనలకు చాలా ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో యూరోపియన్ జాతీయులు కూడా ఎమిరేట్స్లో నివసిస్తున్నారు.
“యూరోపియన్ కమీషన్ EU విమానాశ్రయాలలో లిక్విడ్ స్క్రీనింగ్పై తాత్కాలికంగా పరిమితులను అమలు చేస్తుంది. క్యాబిన్ బ్యాగేజ్ (EDSCB) కోసం ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ సిస్టమ్లను ఉపయోగిస్తుంది. నిర్దిష్ట EU విమానాశ్రయాలలో వ్యవస్థాపించబడిన ఈ వ్యవస్థలు ప్రస్తుతం ప్రయాణీకులు 100ml కంటే ఎక్కువ ద్రవ కంటైనర్లను తీసుకెళ్లడానికి అనుమతిస్తాయి. అయితే, సెప్టెంబరు 1నుండి అమలులోకి వస్తుంది. ఈ రకమైన పరికరాలను నిర్వహించే విమానాశ్రయాల కోసం వ్యక్తిగత లిక్విడ్ కంటైనర్ల కోసం అనుమతించబడిన గరిష్ట పరిమాణం ప్రామాణిక 100mlకి మార్చబడుతుంది. ”అని రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!