నకిలీ ట్రావెల్ ఏజెన్సీలపై జాగ్రత్త.. బహ్రెయిన్ హెచ్చరిక
- August 28, 2024
బహ్రెయిన్: నకిలీ ట్రావెల్ ఏజెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండాలని బహ్రెయిన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు బాగ్దాద్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం ఇరాక్ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిపింది. ట్రావెల్ ఏజెన్సీ యజమాని హోటల్ బిల్లులను చెల్లించడంలో విఫలమవడంతో 140 మంది బహ్రెయిన్ పౌరుల పాస్పోర్ట్లను కర్బలా సిటీలోని ఒక హోటల్ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో బాగ్దాద్లోని బహ్రెయిన్ ఎంబసీకి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బహ్రెయిన్ స్పందించింది. ఉన్నతాధికారుల ప్రయత్నాల ఫలితంగా ప్రయాణ పత్రాలను ఎట్టకేలకు తిరిగి పొందగలిగారు.బహ్రెయిన్లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం ట్రావెల్ ఏజెన్సీల లైసెన్స్లను ధృవీకరించాలని, రిజర్వేషన్లు మరియు చెల్లింపులు చేయడానికి ముందు, నకిలీ బుకింగ్లు మరియు ఏజెన్సీ యజమానుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







