నకిలీ ట్రావెల్ ఏజెన్సీలపై జాగ్రత్త.. బహ్రెయిన్ హెచ్చరిక
- August 28, 2024
బహ్రెయిన్: నకిలీ ట్రావెల్ ఏజెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండాలని బహ్రెయిన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు బాగ్దాద్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం ఇరాక్ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిపింది. ట్రావెల్ ఏజెన్సీ యజమాని హోటల్ బిల్లులను చెల్లించడంలో విఫలమవడంతో 140 మంది బహ్రెయిన్ పౌరుల పాస్పోర్ట్లను కర్బలా సిటీలోని ఒక హోటల్ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో బాగ్దాద్లోని బహ్రెయిన్ ఎంబసీకి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బహ్రెయిన్ స్పందించింది. ఉన్నతాధికారుల ప్రయత్నాల ఫలితంగా ప్రయాణ పత్రాలను ఎట్టకేలకు తిరిగి పొందగలిగారు.బహ్రెయిన్లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం ట్రావెల్ ఏజెన్సీల లైసెన్స్లను ధృవీకరించాలని, రిజర్వేషన్లు మరియు చెల్లింపులు చేయడానికి ముందు, నకిలీ బుకింగ్లు మరియు ఏజెన్సీ యజమానుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









