హాకీ టోర్నమెంట్ లో టీమిండియా కు రజతం..
- June 18, 2016
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో టీమిండియా పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తుదిపోరులో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలై రజతానికి పరిమితమైంది. టైటిల్ నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్ లో ఆస్ట్రేలియా మూడో గోల్స్ చేసి పైచేయి సాధించగా, భారత్ కు ఒక గోల్ మాత్రమే నమోదు చేసింది. భారత ఆటగాళ్లలో హర్మన్ ప్రీత్ సింగ్ తన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ సాధించగా, ఎస్ కే ఉతప్ప, ఎస్వీ సునీల్, సురేందర్ లు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమయ్యారు. దీంతో ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ కు వెళ్లిన భారత్ రన్నరప్ గా సరిపెట్టుకుంది.మరోవైపు పటిష్టమైన ఆస్ట్రేలియా అరాన్ జలేస్కీ, డానియల్ బీలే, సిమన్ ఓర్చాడ్ లు తలో గోల్ చేసి విజయంలో ముఖ్యభూమిక పోషించారు.ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా బీలే వేసిన గోల్ నమోదు చేసిన రెండో గోల్ వివాదస్పదమైంది. ఆ గోల్ పై మ్యాచ్ అనంతరం భారత జట్టు నిరసన వ్యక్తం చేయడంతో తుది ఫలితాన్ని ప్రకటించటానికి కాస్త సమయం పట్టింది. ఈ టోర్నీలో 1982లో భారత్ కాంస్య పతకం మాత్రమే సాధించగా, తొలిసారి రజతం సాధించడం విశేషం. భారత్ రజతం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ జట్టు సభ్యులను అభినందించారు. 'చాంపియన్స్ ట్రోఫీలో రజతం సాధించిన హాకీ జట్టుకు అభినందనలు. భారత జట్టు ఫైనల్ కు చేరే క్రమం నిజంగా అద్భుతం. జట్టు ఆటతీరును చూసి యావత్ భారత జాతి గర్విస్తుంది' అని మోదీ తన ట్వీట్ లో ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









