భద్రత విషయంలో రాజీ పడేది లేదు: బహ్రెయిన్ ప్రధాని
- June 18, 2016
బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, భద్రత విషయంలో బహ్రెయిన్ ఎప్పుడూ రాజీ పడబోదని స్పష్టం చేశారు. జిసిసి దేశాల మధ్య ఐక్యతకు బహ్రెయిన్ కట్టుబడి ఉందనీ, దేశంలో ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలకూ ఆస్కారం ఇవ్వబోమని, తద్వారా బహ్రెయిన్ నుంచి ఇతర దేశాలకు తీవ్రవాదం లేదా ఇతర అసాంఘీక శక్తులువ ఎళ్ళే అవకాశం ఉండదని ప్రిన్స్ ఖలీఫా వివరించారు. గుడైబాలో జరిగిన ఓ సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని కేసుల విచారణ ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉంటుందని, దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా త్వరగా శిక్షించడం కూడా ముఖ్యమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రిన్స్ ఖలీపా. ప్రపంచ దేశాలతో బహ్రెయిన్ ఎప్పుడూ కలిసి పనిచేస్తుందనీ, అంతర్జాతీయ భద్రత విషయంలో బహ్రెయిన్ తన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్, ఫారిన్ మినిస్టర్, జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్ మినిస్టర్, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మరియు పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







