గ్రేటర్ సలాలా మాస్టర్ప్లాన్.. హౌసింగ్ ప్రాజెక్టులను సమీక్ష..!
- August 29, 2024
సలాలా: శాఖ గ్రేటర్ సలాలా, ఫ్యూచర్ సిటీ ఆఫ్ సలాలా కోసం మాస్టర్ప్లాన్కు సంబంధించిన అంశాలపై హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ సమీక్ష నిర్వహించింది. అలాగే దోఫర్ గవర్నరేట్లో ప్రస్తుత మరియు భవిష్యత్తు గృహ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కూడా సమీక్షించారు. సలాలాలోని విలాయత్లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో దోఫర్ గవర్నర్ హిస్ హైనెస్ సయ్యద్ మర్వాన్ బిన్ తుర్కీ అల్ సయీద్, హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ బిన్ సైద్ అల్ షుయైలీ, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నరేట్ మునిసిపల్ కౌన్సిల్, గ్రేటర్ సలాలా మాస్టర్ప్లాన్ మరియు ఒమన్ విజన్ 2040 ప్రకారం ఇతర ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.
సలాలా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం, సేవల నాణ్యతను పెంచడం, మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు జనాభా పెరుగుదలకు అనుగుణంగా.. పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడే సమీకృత అభివృద్ధి, వ్యూహాత్మక ప్రణాళికలపై సమీక్షించారు. విలాయత్లలో పట్టణ ప్రాంతాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ.. భవిష్యత్తు ప్రణాళిక, గృహనిర్మాణ కార్యక్రమాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ధోఫర్ గవర్నరేట్లోని మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సూచనలు, అభిప్రాయాలను తెలుసుకుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









