వచ్చే నెల 8న భారత్కు వెళ్లనున్న అబుధాబి క్రౌన్ ప్రిన్స్
- August 29, 2024
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు.యూఏఈ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా భారతదేశం యూఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్కు వస్తున్నట్లు తెలుస్తోంది.
షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటన పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.తన పర్యటనలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారని తెలుస్తోంది.ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడం పై దృష్టి సారించనున్నది.
‘భారత్, యూఏఈ మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి.ఈ పర్యటనలో ఆ పునాదిని మరింత బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దాల కోసం ఎదురుచూడడం, యూఏఈ భవిష్యత్ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం పై దృష్టి సారించనున్నట్లు-అబుధాబి అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







