వచ్చే నెల 8న భారత్కు వెళ్లనున్న అబుధాబి క్రౌన్ ప్రిన్స్
- August 29, 2024
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు.యూఏఈ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా భారతదేశం యూఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్కు వస్తున్నట్లు తెలుస్తోంది.
షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటన పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.తన పర్యటనలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారని తెలుస్తోంది.ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడం పై దృష్టి సారించనున్నది.
‘భారత్, యూఏఈ మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి.ఈ పర్యటనలో ఆ పునాదిని మరింత బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దాల కోసం ఎదురుచూడడం, యూఏఈ భవిష్యత్ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం పై దృష్టి సారించనున్నట్లు-అబుధాబి అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు