యూఏఈలో ఆమ్నెస్టీ: భారతీయ పౌరులకు ఎంబసీ కీలక సూచనలు..!
- August 30, 2024
యూఏఈ: సెప్టెంబర్ 1 నుంచి యూఏఈలో రెండు నెలల క్షమాభిక్ష పథకం ప్రారంభమవుతుంది.ఈ నేపథ్యంలో అబుదాబి ఎమిరేట్లో నివసిస్తున్న భారతీయ పౌరుల ప్రయోజనాల కోసం అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ పలు సూచనలు చేసింది.దరఖాస్తుదారులు అల్ రీమ్, ముసఫా మరియు అల్-ఐన్లోని ఏదైనా BLS కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది. ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేయడానికి నేరుగా చేరుకోవాలని, ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదని పేర్కొంది.
ఇండియాకు తిరిగి రావాలనుకునే దరఖాస్తుదారులకు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ (EC) ఉంటుందని గుర్తుచేసింది. దరఖాస్తుదారులు కాన్సులర్ నుండి ECలను తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం భారత రాయబార కార్యాలయం అబుదాబి (101,102, ఇస్ట్ ఫ్లోర్, గారిడాన్ టవర్, అల్సాదా జోన్ I) లో సాయత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య దరఖాస్తులు అందజేయాలని సూచించింది. తమ రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించుకోవాలనుకునే దరఖాస్తుదారులు అల్ రీమ్, ముసఫా మరియు అల్-ఐన్లోని BLS కేంద్రాలలో షార్ట్వాలిడిటీ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆమ్నెస్టీ స్కీమ్ అమల్లో ఉన్నసమయంలో ఏదైనా సమాచారం కోసం మొబైల్ నంబర్ 050-8995583లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో ఎంబసీ వెల్లడించింది. [
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







