యూఏఈలో వీసా అమ్నెస్టీ ప్రోగ్రాం..ధరఖాస్తు ప్రక్రియ, విధివిధానాలు..!
- August 30, 2024
యూఏఈ: దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) యూఏఈ వీసా అమ్నెస్టీ ప్రోగ్రాం కోసం దరఖాస్తుదారులను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇది సెప్టెంబర్ 1 ప్రారంభమవుతున్న విషయం తెలిపిందే. ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు రెండు నెలల పాటు ఈ స్కీమ్ కొనసాగుతుంది. అల్ అవీర్లోని GDRFA సెంటర్లో వీసా స్టేటస్ని మార్చుకునేందుకు ప్రత్యేకంగా కేటాయించారు. దీనితోపాటు దుబాయ్లోని 86 అమెర్ సెంటర్లలో దరఖాస్తుదారులు వెళ్లవచ్చని GDRFA వెల్లడించింది.
అయితే, ఎమిరేట్స్ లో ఉండాలనుకునే వారి కోసం అమేర్ కేంద్రాలు సేవలు అందిస్తాయని తెలిపారు. బయోమెట్రిక్ వేలిముద్రలు కలిగిన వారికి (ఎమిరేట్స్ ID ఉన్నవారు) మాత్రమే బయలుదేరే అనుమతులను జారీ చేస్తారని పేర్కొన్నారు. దేశం విడిచి వెళ్లాలనుకునే వారికి డిపార్చర్ పర్మిట్లను కూడా జారీ చేస్తుందన్నారు. కాగా, ఏదైనా వీసా చట్టం ఉల్లంఘించిన వారు దేశానికి తిరిగి రాకుండా ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ పరిమితులు లేకుండా క్షమాభిక్షను పొందిన తర్వాత యూఏఈ వదిలి వెళ్ళడానికి అనుమతిస్తారని తెలిపింది. పాస్పోర్ట్పై ఎటువంటి నిషేధ స్టాంప్ ఉండదని, వారు చెల్లుబాటు అయ్యే వీసాపై యూఏఈలోకి తిరిగి ప్రవేశించవచ్చని GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి వెల్లడించారు. క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు అధికారిక మూలాల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలని, 24/7 పనిచేసే GDRFA కాల్ సెంటర్ 8005111 ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







