హమద్ పోర్ట్ లో 17 కిలోల గంజాయి సీజ్
- August 30, 2024
దోహా: ఖతార్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ), ఖతార్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఇందులో స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నారు. ఎంఓఐ విభాగానికి చెందిన పోలీసు డాగ్ విభాగం మత్తుపదార్థాలను దాచిన ప్రాంతాలను గుర్తించాయి. అనంతరం హమద్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగలు, హస్తకళలు ఉన్నట్లు లేబుల్ చేసిన పార్శిళ్లలో గంజాయిని దాచి తరలించే యత్నం చేశారు. ఎక్స్-రే పరికరాలను ఉపయోగించి చెక్క వస్తువుల లోపల మత్తుపదార్థాలు దాగి ఉంచారు. స్వాధీనం చేసుకున్న పదార్థం మొత్తం బరువు సుమారు 17 కిలోగ్రాములు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







