600 దిర్హామ్ల కోసం ప్రవాసిపై దాడి..7 మందిని అరెస్టు
- August 31, 2024
యూఏఈ: బుధవారం ఎమిరేట్లోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఘర్షణలో షార్జా నివాసి మరణించినట్లు అధికారులు తెలిపారు. 600 దిర్హామ్ల అప్పు విషయంలో గొడవ ప్రారంభమైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు తోబుట్టువులను కర్రలు, కత్తులతో కొట్టినందుకు ఏడుగురు ఆసియా ప్రవాసులను అరెస్టు చేసినట్లు షార్జా పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తీవ్ర వాగ్వాదంతో ప్రారంభమైందని, అనంతరం ఇది భౌతిక దాడికి దారితీసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
అయితే, సంఘటన జరిగిన వెంటనే షార్జా పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి, ట్రాక్ చేయగలిగారు. రెండు గంటల్లోనే వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆర్థిక పరమైన వివాదం కారణంగా బాధితులపై దాడి చేసినట్లు ఏడుగురు వ్యక్తులు అంగీకరించారు. వివాదాలు వచ్చినప్పుడు చట్టపరమైన విధానాలను ఎల్లప్పుడూ అనుసరించాలని షార్జా పోలీసులు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







