600 దిర్హామ్ల కోసం ప్రవాసిపై దాడి..7 మందిని అరెస్టు
- August 31, 2024
యూఏఈ: బుధవారం ఎమిరేట్లోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఘర్షణలో షార్జా నివాసి మరణించినట్లు అధికారులు తెలిపారు. 600 దిర్హామ్ల అప్పు విషయంలో గొడవ ప్రారంభమైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు తోబుట్టువులను కర్రలు, కత్తులతో కొట్టినందుకు ఏడుగురు ఆసియా ప్రవాసులను అరెస్టు చేసినట్లు షార్జా పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తీవ్ర వాగ్వాదంతో ప్రారంభమైందని, అనంతరం ఇది భౌతిక దాడికి దారితీసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
అయితే, సంఘటన జరిగిన వెంటనే షార్జా పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి, ట్రాక్ చేయగలిగారు. రెండు గంటల్లోనే వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆర్థిక పరమైన వివాదం కారణంగా బాధితులపై దాడి చేసినట్లు ఏడుగురు వ్యక్తులు అంగీకరించారు. వివాదాలు వచ్చినప్పుడు చట్టపరమైన విధానాలను ఎల్లప్పుడూ అనుసరించాలని షార్జా పోలీసులు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!