3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..

- August 31, 2024 , by Maagulf
3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..

న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. లక్నో- మీరఠ్, మధురై-బెంగళూరు, చెన్నై-నాగర్కోయిల్ మధ్య ఈ వందేభారత్ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లను మోదీ వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవానికి దక్షిణాది రాష్ట్రాలు వేగంగా వృద్ధి చెందడం కీలకమని ప్రధాని మోదీ చెప్పారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పెంచిన బడ్జెట్ కేటాయింపుల వల్ల దక్షిణాదిలో రైలు రవాణా మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. వందేభారత్ రైలు వల్ల మీరఠ్- లక్నో మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట మేర ఆదా అవుతుందని తెలిపారు.

మిగతా రైళ్ల వల్ల కూడా సమయం ఆదా అవుతుందని చెప్పారు.ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపడంలో భారతీయ రైల్వే ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికీ సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే రైల్వే లక్ష్యమని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com