క్షమాభిక్ష కోరుకునే వారికి తక్కువ ధరకు విమానయాన టిక్కెట్లు..!
- September 01, 2024
యూఏఈ: క్షమాభిక్ష పొంది వారి దేశాలకు తిరిగి రావాలనుకునే వారికి తక్కువ ధరకు విమాన టిక్కెట్లను అందించడానికి ఎయిర్లైన్స్ అంగీకరించాయి. ఇది రెండు నెలల పాటు అమల్లో ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) తెలిపింది. ఈ క్రమంలో జాతీయ మరియు విదేశీ విమానయాన సంస్థలతో సమావేశాలు నిర్వహించామని ICP స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్ నుండి లబ్ది పొందుతున్న వారికి రెండు నెలల పాటు తగ్గింపుతో కూడిన ప్రయాణ టిక్కెట్లను అందించడానికి ఎయిర్లైన్స్ తమ సహకారాన్ని మరియు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం లేకుండా సెప్టెంబర్ 1నుండి ICP ఆమోదించబడిన టైపింగ్ కార్యాలయాల ఎలక్ట్రానిక్, స్మార్ట్ ఛానెల్ల ద్వారా వారి అభ్యర్థనలను సమర్పించాలని ICP పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









