క్షమాభిక్ష కోరుకునే వారికి తక్కువ ధరకు విమానయాన టిక్కెట్లు..!
- September 01, 2024
యూఏఈ: క్షమాభిక్ష పొంది వారి దేశాలకు తిరిగి రావాలనుకునే వారికి తక్కువ ధరకు విమాన టిక్కెట్లను అందించడానికి ఎయిర్లైన్స్ అంగీకరించాయి. ఇది రెండు నెలల పాటు అమల్లో ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) తెలిపింది. ఈ క్రమంలో జాతీయ మరియు విదేశీ విమానయాన సంస్థలతో సమావేశాలు నిర్వహించామని ICP స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్ నుండి లబ్ది పొందుతున్న వారికి రెండు నెలల పాటు తగ్గింపుతో కూడిన ప్రయాణ టిక్కెట్లను అందించడానికి ఎయిర్లైన్స్ తమ సహకారాన్ని మరియు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం లేకుండా సెప్టెంబర్ 1నుండి ICP ఆమోదించబడిన టైపింగ్ కార్యాలయాల ఎలక్ట్రానిక్, స్మార్ట్ ఛానెల్ల ద్వారా వారి అభ్యర్థనలను సమర్పించాలని ICP పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









