ఒమన్-ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!
- September 01, 2024
ముంబయి: ఒమన్ వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ అల్ యూసెఫ్ ఇండియాలో పర్యటిస్తున్నారు. విదేశీ వాణిజ్యం మరియు అంతర్జాతీయ సహకార సలహాదారు పంకజ్ ఖిమ్జీతో కలిసి స్వేచ్ఛా వాణిజ్యం కోసం పనిచేస్తున్నారు. ఒమన్ -భారతదేశం మధ్య ఒప్పందం (FTA) కోసం చర్చలు జరుపుతున్నారు. భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)లో తాజా చర్చలు కొనసాగుతున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో భారీ మార్కెట్ ఉందని, ఒమన్ దాని వ్యూహాత్మక ఓడరేవులైన సోహర్, సలాలా మరియు దుక్మ్లతో అభివృద్ధి భాగస్వామిగా ఉంటుందని మంత్రి తెలిపారు. భారత కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సహకారాన్ని పెంపొందించడం, వృద్ధికి కొత్త మార్గాలను సృష్టించడం, భారతదేశం-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గురించి చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం, సహకారాన్ని పెంపొందించడం, వృద్ధికి కొత్త మార్గాలను అన్లాక్ చేయడం, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు దృష్టి సారించాయని గోయల్ చెప్పారు. భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకాలు చేసేందుకు జరుగుతున్న చర్చల వేగంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







