ఒమన్-ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!
- September 01, 2024
ముంబయి: ఒమన్ వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ అల్ యూసెఫ్ ఇండియాలో పర్యటిస్తున్నారు. విదేశీ వాణిజ్యం మరియు అంతర్జాతీయ సహకార సలహాదారు పంకజ్ ఖిమ్జీతో కలిసి స్వేచ్ఛా వాణిజ్యం కోసం పనిచేస్తున్నారు. ఒమన్ -భారతదేశం మధ్య ఒప్పందం (FTA) కోసం చర్చలు జరుపుతున్నారు. భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)లో తాజా చర్చలు కొనసాగుతున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో భారీ మార్కెట్ ఉందని, ఒమన్ దాని వ్యూహాత్మక ఓడరేవులైన సోహర్, సలాలా మరియు దుక్మ్లతో అభివృద్ధి భాగస్వామిగా ఉంటుందని మంత్రి తెలిపారు. భారత కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సహకారాన్ని పెంపొందించడం, వృద్ధికి కొత్త మార్గాలను సృష్టించడం, భారతదేశం-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గురించి చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం, సహకారాన్ని పెంపొందించడం, వృద్ధికి కొత్త మార్గాలను అన్లాక్ చేయడం, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు దృష్టి సారించాయని గోయల్ చెప్పారు. భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకాలు చేసేందుకు జరుగుతున్న చర్చల వేగంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!