యూఏఈలో స్వల్ప భూకంపం..భయంతో వణికిన ప్రజలు..!

- September 01, 2024 , by Maagulf
యూఏఈలో స్వల్ప భూకంపం..భయంతో వణికిన ప్రజలు..!

యూఏఈ: ఆదివారం యూఏఈలో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది.  నేషనల్ సీస్మిక్ నెట్‌వర్క్ స్టేషన్లు మసాఫీలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. యూఏఈ కాలమానం ప్రకారం.. ఉదయం 7.53 గంటలకు మసాఫీలో భూకంపం నమోదైంది. 1.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూకంపం నుండి ప్రకంపనలను అనుభవించినట్లు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, భూకంపం యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని NCM తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com