ఒమన్కు పోటెత్తిన విజిటర్స్..7 నెలల్లో 2.3 మిలియన్ల మంది రాక..!
- September 09, 2024
మస్కట్: 2024 మొదటి ఏడు నెలల్లో 2.3 మిలియన్ల మంది విజిటర్స్ ను సుల్తానేట్ ఆఫ్ ఒమన్ స్వాగతం పలికింది. 2023లో ఇదే కాలంలో దేశాన్ని సందర్శించిన 2.2 మిలియన్ల మందితో పోలిస్తే ఇది 2.4 శాతం అధికం కావడం గమనార్హం. సందర్శకులలో మొదటి ఐదు స్థానాల్లో ఎమిరాటీలు (714,636), భారతీయులు (367,166), యెమెన్లు (139,354), జర్మన్లు (79,439) ఉన్నారు. అదే సమయంలో 4.7 మిలియన్ల మంది సందర్శకులు దేశం నుంచి వెళ్లారని నివేదికలు తెలిపాయి. ఇందులో 3,353,777 మంది ఒమానీలు, 506,121 మంది భారతీయులు, 302,351 మంది పాకిస్థానీలు, 171,799 బంగ్లాదేశీయులు, 131,575 మంది యెమెన్లు ఉన్నారు.
జూలైలో అంతర్జాతీయ విమానాల్లో దేశానికి చేరుకున్న మొదటి ఆరు స్థానాల్లో 105,581 మంది భారతీయులు, 104,050 మంది ఒమానీలు, 29,531 పాకిస్థానీయులు, 18,489 బంగ్లాదేశీయులు, 13,623 ఈజిప్షియన్లు, 11,633 ఎమిరాటీలు ఉన్నారు. హోటల్ ఆక్యుపెన్సీ (3 నుండి 5 నక్షత్రాలు) విషయానికొస్తే.. మస్కట్లో 40.2 శాతం, ధోఫర్ 46.5 శాతం, నార్త్ అల్ బతినా 49 శాతం, సౌత్ అల్ షర్కియా 35.1 శాతం, అల్ ధఖిలియా 31.3 శాతంగా నమోదయింది.
తాజా వార్తలు
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..







