ఒమన్కు పోటెత్తిన విజిటర్స్..7 నెలల్లో 2.3 మిలియన్ల మంది రాక..!
- September 09, 2024
మస్కట్: 2024 మొదటి ఏడు నెలల్లో 2.3 మిలియన్ల మంది విజిటర్స్ ను సుల్తానేట్ ఆఫ్ ఒమన్ స్వాగతం పలికింది. 2023లో ఇదే కాలంలో దేశాన్ని సందర్శించిన 2.2 మిలియన్ల మందితో పోలిస్తే ఇది 2.4 శాతం అధికం కావడం గమనార్హం. సందర్శకులలో మొదటి ఐదు స్థానాల్లో ఎమిరాటీలు (714,636), భారతీయులు (367,166), యెమెన్లు (139,354), జర్మన్లు (79,439) ఉన్నారు. అదే సమయంలో 4.7 మిలియన్ల మంది సందర్శకులు దేశం నుంచి వెళ్లారని నివేదికలు తెలిపాయి. ఇందులో 3,353,777 మంది ఒమానీలు, 506,121 మంది భారతీయులు, 302,351 మంది పాకిస్థానీలు, 171,799 బంగ్లాదేశీయులు, 131,575 మంది యెమెన్లు ఉన్నారు.
జూలైలో అంతర్జాతీయ విమానాల్లో దేశానికి చేరుకున్న మొదటి ఆరు స్థానాల్లో 105,581 మంది భారతీయులు, 104,050 మంది ఒమానీలు, 29,531 పాకిస్థానీయులు, 18,489 బంగ్లాదేశీయులు, 13,623 ఈజిప్షియన్లు, 11,633 ఎమిరాటీలు ఉన్నారు. హోటల్ ఆక్యుపెన్సీ (3 నుండి 5 నక్షత్రాలు) విషయానికొస్తే.. మస్కట్లో 40.2 శాతం, ధోఫర్ 46.5 శాతం, నార్త్ అల్ బతినా 49 శాతం, సౌత్ అల్ షర్కియా 35.1 శాతం, అల్ ధఖిలియా 31.3 శాతంగా నమోదయింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







