ఈ పుకారుతో మార్మోగిపోతున్న సోషల్ మీడియా..
- September 10, 2024
ఏంటి రజినీకాంత్ తన కూతురికి ఆ విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లి చేయాలనుకుంటున్నారా.. ఇంతకీ ఆ హీరో ఎవరు.. కోలీవుడ్ వైరల్ అవుతున్న ఈ వార్త నిజమేనా అనేది ఇప్పుడు చూద్దాం..
రజినీకాంత్ కి ఇద్దరు కూతుర్లు.. అందులో మొదటి కూతురు ఐశ్వర్య రెండో కూతురు సౌందర్య. ఇందులో ఐశ్వర్య ధనుష్ ని పెళ్లి చేసుకుని 18ఏళ్లు కాపురం చేసి ఆ తర్వాత విడాకులు తీసుకుంది.
ఇక సౌందర్య కూడా మొదట వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి తర్వాత మరో వ్యక్తిని పెళ్ళాడింది. అయితే తాజాగా రజినీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్య కి ఆ విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లి చేయాలని చూస్తున్నట్టు కోలీవుడ్ మీడియా లో టాక్.ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా జయం రవి విడాకులు తీసుకున్నారు. అయితే ఈయన విడాకులు అనౌన్స్ చేసి కనీసం 24 గంటలు కూడా పూర్తి అవ్వలేదు.
అప్పుడే రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ని జయం రవి రెండో పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దానికి కారణం ఐశ్వర్యకి విడాకులు అయ్యాయి అలాగే జయం రవి కూడా విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో రజినీకాంత్ ఐశ్వర్యని రవి కిచ్చి వివాహం చేయాలనుకున్నారట.
కానీ అప్పటికే ఆయన వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నారని తెలిసి సైలెంట్ అయ్యారట.అయితే ఈ సీక్రెట్ విషయాన్ని సబితా జోసెఫ్ అనే జర్నలిస్టు బయట పెట్టారు.అయితే ప్రస్తుతం జయం రవి విడాకులు తీసుకోవడంతో ఆ జర్నలిస్ట్ చెప్పిన మాటలు ఇప్పుడు మీడియాలో వైరల్ చేస్తూ ఇద్దరు విడాకులు తీసుకున్నారు కాబట్టి రజినీకాంత్ వీరిద్దరికి రెండో పెళ్లి చేస్తారు కావచ్చు అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









