12 ఏళ్ల తర్వాత ఆ దేశంలో ఎంబసీ ప్రారంభించిన సౌదీ..!
- September 11, 2024
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్లో 12 సంవత్సరాల క్రితం సిరియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి మూసివేసిన తన రాయబార కార్యాలయాన్ని సౌదీ అరేబియా తిరిగి ప్రారంభించింది. సిరియాలోని సౌదీ ఛార్జ్ డి అఫైర్స్ యాక్టింగ్ అబ్దుల్లా అల్-హరీస్ అధికారికంగా ఎంబసీని ప్రారంభించారు. రెండు దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా అల్-హరీస్ అభివర్ణించారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది కీలక ముందడుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిరియా విదేశాంగ వ్యవహారాల మంత్రి అయ్యమన్ రాద్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా.. ఈ చర్య ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. ఈ ఏడాది మేలో సిరియాలో సౌదీ రాయబారిగా ఫైసల్ బిన్ సౌద్ అల్-ముజ్ఫెల్ను నియమించారు. సిరియా కూడా సౌదీ అరేబియాకు కొత్త రాయబారిగా డాక్టర్ ముహమ్మద్ సౌసాన్ను నియమించింది. ఈ ఏడాది జనవరిలో డాక్టర్ సౌసాన్ రియాద్లో బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2023లో తమ దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించాలనే నిర్ణయాన్ని సౌదీ అరేబియా, సిరియా ప్రకటించాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









