12 ఏళ్ల తర్వాత ఆ దేశంలో ఎంబసీ ప్రారంభించిన సౌదీ..!
- September 11, 2024
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్లో 12 సంవత్సరాల క్రితం సిరియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి మూసివేసిన తన రాయబార కార్యాలయాన్ని సౌదీ అరేబియా తిరిగి ప్రారంభించింది. సిరియాలోని సౌదీ ఛార్జ్ డి అఫైర్స్ యాక్టింగ్ అబ్దుల్లా అల్-హరీస్ అధికారికంగా ఎంబసీని ప్రారంభించారు. రెండు దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా అల్-హరీస్ అభివర్ణించారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది కీలక ముందడుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిరియా విదేశాంగ వ్యవహారాల మంత్రి అయ్యమన్ రాద్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా.. ఈ చర్య ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. ఈ ఏడాది మేలో సిరియాలో సౌదీ రాయబారిగా ఫైసల్ బిన్ సౌద్ అల్-ముజ్ఫెల్ను నియమించారు. సిరియా కూడా సౌదీ అరేబియాకు కొత్త రాయబారిగా డాక్టర్ ముహమ్మద్ సౌసాన్ను నియమించింది. ఈ ఏడాది జనవరిలో డాక్టర్ సౌసాన్ రియాద్లో బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2023లో తమ దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించాలనే నిర్ణయాన్ని సౌదీ అరేబియా, సిరియా ప్రకటించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







