పటాకుల తయారీ.. అమ్మకాలపై ఢిల్లీ ప్రభుత్వం బ్యాన్
- September 11, 2024
న్యూ ఢిల్లీ: రాబోయే వింటర్ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా పటాకుల తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఆన్లైన్లో క్రాకర్స్ అమ్మకం, డెలివరీలకూ ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు ఢిల్లీ పోలీస్, పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, రెవెన్యూశాఖల కో ఆర్డినేషన్ తో యాక్షన్ ప్లాన్ రెడీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ను కంట్రోల్ చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న 21 ఫోకస్ పాయింట్ల ఆధారంగా పటాకుల తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!









