గాజాలో పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి..తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- September 13, 2024
రియాద్: గాజా స్ట్రిప్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా ఇజ్రాయెట్ జరిపిన దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ బలగాల చర్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ దాడిలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA) ఉద్యోగులతో సహా అనేక మంది వ్యక్తులు మరణించారు. తక్షణ కాల్పుల విరమణ, నిరాయుధ పౌరులకు రక్షణ, అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిన కారణంగా గాజా స్ట్రిప్లో అపూర్వమైన మానవతా విపత్తుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని మరోసారి సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. రిలీఫ్ సౌకర్యాలు, సంస్థలు వారి కార్మికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టాలపై ఇజ్రాయెల్ ఉల్లంఘనల పరంపర కొనసాగుతుందని, దీనికి ముగింపు పలకడం కోసం ఒత్తిడి తేవాలని ప్రపంచ దేశాలను సౌదీ అరేబియా కోరింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







