గాజాలో పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి..తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- September 13, 2024
రియాద్: గాజా స్ట్రిప్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా ఇజ్రాయెట్ జరిపిన దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ బలగాల చర్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ దాడిలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA) ఉద్యోగులతో సహా అనేక మంది వ్యక్తులు మరణించారు. తక్షణ కాల్పుల విరమణ, నిరాయుధ పౌరులకు రక్షణ, అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిన కారణంగా గాజా స్ట్రిప్లో అపూర్వమైన మానవతా విపత్తుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని మరోసారి సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. రిలీఫ్ సౌకర్యాలు, సంస్థలు వారి కార్మికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టాలపై ఇజ్రాయెల్ ఉల్లంఘనల పరంపర కొనసాగుతుందని, దీనికి ముగింపు పలకడం కోసం ఒత్తిడి తేవాలని ప్రపంచ దేశాలను సౌదీ అరేబియా కోరింది.
తాజా వార్తలు
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!









