గాజాలో పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి..తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- September 13, 2024
రియాద్: గాజా స్ట్రిప్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా ఇజ్రాయెట్ జరిపిన దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ బలగాల చర్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ దాడిలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA) ఉద్యోగులతో సహా అనేక మంది వ్యక్తులు మరణించారు. తక్షణ కాల్పుల విరమణ, నిరాయుధ పౌరులకు రక్షణ, అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిన కారణంగా గాజా స్ట్రిప్లో అపూర్వమైన మానవతా విపత్తుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని మరోసారి సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. రిలీఫ్ సౌకర్యాలు, సంస్థలు వారి కార్మికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టాలపై ఇజ్రాయెల్ ఉల్లంఘనల పరంపర కొనసాగుతుందని, దీనికి ముగింపు పలకడం కోసం ఒత్తిడి తేవాలని ప్రపంచ దేశాలను సౌదీ అరేబియా కోరింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









