కువైట్ లో మహిళకు వేధింపులు..రంగంలోకి ఏపీ మంత్రి!
- September 13, 2024
కువైట్ సిటీ: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కవితా అనే మహిళ బ్రతుకుతెరువు కోసం కువైట్ వెళ్లానని ఇక్కడ కువైట్ వాళ్ళు నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ బయట ఒక రూములో బందించి తినడానికి తిండి కూడా ఇవ్వకుండా నాకు నరకం చూపిస్తున్నారని ఇక్కడ ఏజెంట్ ను అడగగా అతను నన్ను బెదిరిస్తూ నువ్వు ఇక్కడ డబ్బులు కట్టాలి లేదంటే నిన్ను ఇక్కడ అమ్మేస్తామని నన్ను భయపెడుతున్నాడని, నాకు వీసా తీసిన అతనిని అన్నా నేను ఇక్కడ పని చేయలేను వీళ్ళు నన్ను కొడుతున్నారు అని అడగగా నువ్వు ఇక్కడ నుంచి పారిపో నాకు సంబంధం లేదు అని చెప్పి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ బ్లాక్ లిస్టులో పెట్టాడని, అన్నా నాకు ఇద్దరు పిల్లలు భర్త ఉన్నాడని నా భర్త వికలాంగుడు ఏ పని చేయలేడని నేను నా బిడ్డల కోసం బ్రతుకు తెరువు కోసం కువైట్ వస్తే ఇలా నాకు అన్యాయం జరిగింది. నాకు ఇక్కడ ఎవరు సహాయం చేయడం లేదు అన్నా మీరే నన్ను ఎలాగైనా కాపాడి ఇండియాకు వచ్చేలా సహాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వేడుకుంది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!









