ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- September 18, 2024
దోహా: ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 2024-2030 నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సురక్షితంగా స్వీకరించడంలో ఖతార్ను గ్లోబల్ లీడర్గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సైబర్స్పేస్పై నమ్మకాన్ని పెంపొందించడానికి అనేక ప్రచార కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రిస్క్ బేస్డ్ అప్రోచ్, రిజల్ట్స్ ఓరియెంటెడ్, వ్యక్తిగత మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సు, సమన్వయం, విలువలపై జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ మార్గదర్శక సూత్రాలు ఆధారపడి ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న సైబర్ సవాళ్లను పరిష్కరించడానికి రెండవ జాతీయ సైబర్ భద్రతా వ్యూహం రోడ్మ్యాప్గా పనిచేస్తుందన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







