ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- September 18, 2024
దోహా: ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 2024-2030 నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సురక్షితంగా స్వీకరించడంలో ఖతార్ను గ్లోబల్ లీడర్గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సైబర్స్పేస్పై నమ్మకాన్ని పెంపొందించడానికి అనేక ప్రచార కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రిస్క్ బేస్డ్ అప్రోచ్, రిజల్ట్స్ ఓరియెంటెడ్, వ్యక్తిగత మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సు, సమన్వయం, విలువలపై జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ మార్గదర్శక సూత్రాలు ఆధారపడి ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న సైబర్ సవాళ్లను పరిష్కరించడానికి రెండవ జాతీయ సైబర్ భద్రతా వ్యూహం రోడ్మ్యాప్గా పనిచేస్తుందన్నారు.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







