ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- September 18, 2024
దోహా: ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 2024-2030 నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సురక్షితంగా స్వీకరించడంలో ఖతార్ను గ్లోబల్ లీడర్గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సైబర్స్పేస్పై నమ్మకాన్ని పెంపొందించడానికి అనేక ప్రచార కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రిస్క్ బేస్డ్ అప్రోచ్, రిజల్ట్స్ ఓరియెంటెడ్, వ్యక్తిగత మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సు, సమన్వయం, విలువలపై జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ మార్గదర్శక సూత్రాలు ఆధారపడి ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న సైబర్ సవాళ్లను పరిష్కరించడానికి రెండవ జాతీయ సైబర్ భద్రతా వ్యూహం రోడ్మ్యాప్గా పనిచేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..