జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ ఆహార పదార్ధాలు తినాల్సిందే.!
- September 18, 2024
మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మెదడు. ఇది శరీరంలోని మిగిలిన అవయవాలన్నింటితోనూ కనెక్ట్ అయ్యి శరీరం పని చేయడానికి అవసరమైన శక్తిని ఇండికేషన్స్నీ అందిస్తుంది. అందుకే మెదడు చురుగ్గా పని చేస్తేనే శరీరం సరిగ్గా పని చేస్తున్నట్లు.
అయితే, మెదడు చురుగ్గా పని చేసేందుకు ఏం చేయాలి.? ముఖ్యంగా మంచి పోషకాలున్న ఆహారం తినాలి. అయితే, మెదడును శక్తివంతంగా పని చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్ధాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
వాల్ నట్స్, వేరుశనగలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయ్. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.
కాలీ ఫ్లవర్, బ్రోకోలీ వంటి కూరగాయల్లో అధిక మొత్తం కోలీన్ వుంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా పని చేసేందుకు తోడ్పడుతుంది. అందుకే వీటిని కూడా డైట్లో తప్పని సరిగా చేర్చుకోవాలి.
బీన్స్లోనూ విటమిన్ బి మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయ్. ఇవి జ్ఞాపక శక్తిని మెరుగు పరిచేందుకు తోడ్పడతాయ్. ఆకుకూరల్లో వుండే విటమిన్ ఇ, ఫోలేట్ మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయ్.
బ్లూ బెర్రీస్ ఇతరత్రా బెర్రీస్ ఏవైనా మెదడు ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడతాయ్. అంతేకాదు, క్షీణించిన మెదడు నరాల్ని ఉత్తేజపరచడంలోనూ బెర్రీస్ పాత్ర కీలకం.
నాన్ వెజ్లో సాల్మన్ ఫిష్కి జ్ఞాపక శక్తిని మెరుగు పరిచే సామర్ధ్యం ఎక్కువ. చచ్చుబడిపోయిన నరాల పనితీరును మెరుగు పరిచి కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంచడంలో సాల్మన్ ఫిష్ బాగా యూజ్ అవుతుంది.
తాజా వార్తలు
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..