ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..
- September 18, 2024
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు(బుధవారం) ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఉదయం 11గంటలకు ఈ సమావేశం మొదలుకాగా.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తీసుకొచ్చిన మద్యం పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆపరేషన్ బుడమేరు అంశం పై కూడా కేబినెట్ చర్చించింది.
ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. దీని కోసం కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇవి కాకుండా పారిశ్రామిక అభివృద్ధి, విద్యుత్ సంస్కరణలపై కూడా మంత్రిమండలి సమాలోచనలు జరుపుతోంది. వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల పని తీరు ఇలా అన్నింటిపై కూలంకుశంగా మాట్లాడుకున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్ను చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అందజేశారు. ఈనెల 20వ తారీకుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100రోజులు కానుండడంతో ఇప్పటివరకూ చేసిన పనులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
తాజా వార్తలు
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- భారత్కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- సాహితీ లోకం ఆత్మీయురాలు సుధ ను కోల్పోయింది: నటుడు రాజేంద్ర ప్రసాద్
- నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!







