కువైట్ లో గుండె పోటుతో జగిత్యాల వాసి మృతి...!
- September 19, 2024
కువైట్ సిటీ: కువైట్ లో మరో తెలంగాణ వ్యక్తి మరణించారు. కువైట్ లో అకస్మాత్తుగా గుండె పోటుతో జగిత్యాల వాసి మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయి కృష్ణ (37) అకస్మాత్తుగా గుండె పోటు తో మృతి చెందడం జరిగింది. సాయి కృష్ణ... కువైట్ లో పది సంవత్సరాల నుండి ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించూకుంటున్నాడు. అయితే.. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తున్నారు సాయి కృష్ణ. ఇటీవలే నెల క్రితం ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులతో కలసి తీర్థ యాత్రలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సాయి కృష్ణ. తిరిగి మళ్ళీ బ్రతుకు తెరువు కోసం 5 రోజుల క్రితం కువెట్ వెళ్ళాడం జరిగింది. అయితే...ఈ తరుణంలోనే... ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పిల్లలు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇక మృతిడికి భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









