కువైట్ లో గుండె పోటుతో జగిత్యాల వాసి మృతి...!
- September 19, 2024
కువైట్ సిటీ: కువైట్ లో మరో తెలంగాణ వ్యక్తి మరణించారు. కువైట్ లో అకస్మాత్తుగా గుండె పోటుతో జగిత్యాల వాసి మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయి కృష్ణ (37) అకస్మాత్తుగా గుండె పోటు తో మృతి చెందడం జరిగింది. సాయి కృష్ణ... కువైట్ లో పది సంవత్సరాల నుండి ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించూకుంటున్నాడు. అయితే.. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తున్నారు సాయి కృష్ణ. ఇటీవలే నెల క్రితం ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులతో కలసి తీర్థ యాత్రలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సాయి కృష్ణ. తిరిగి మళ్ళీ బ్రతుకు తెరువు కోసం 5 రోజుల క్రితం కువెట్ వెళ్ళాడం జరిగింది. అయితే...ఈ తరుణంలోనే... ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పిల్లలు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇక మృతిడికి భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









