కువైట్లో 32 ఏళ్లపాటు సేవలు.. డాక్టర్ రమేష్ పండితకు ఘన సత్కారం..!!
- September 19, 2024
కువైట్: ఇటీవలే కువైట్ ఆరోగ్య సంరక్షణ రంగానికి విశేషమైన సేవలందించినందుకు ప్రఖ్యాత భారతీయ వైద్యుడు, డాక్టర్ రెమేష్ పండితను కువైట్ ఆరోగ్య మంత్రి, డాక్టర్ అహ్మద్ అల్-అవధి ఘనంగా సత్కరించారు. మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్-ముతైరీ హాజరయ్యారు. డాక్టర్ పండిత పదవీ విరమణ సందర్భంగా మూడు దశాబ్దాల సేవలకు గుర్తుగా జ్ఞాపికను అందజేశారు.
డాక్టర్ పండిత, 1977లో భారతదేశంలోని కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు. 1982లో చండీగఢ్లోని PGIMER నుండి MD పట్టా పొందారు. కువైట్ క్యాన్సర్ నియంత్రణ కేంద్రంలో హేమటాలజీ విభాగంలో చేరారు. అక్కడ అతను 32 సంవత్సరాలు పనిచేశారు. తన కెరీర్ లో లుకేమియా, మైలోమాపై ప్రత్యేక దృష్టి సారించి, బ్లడ్ క్యాన్సర్ రోగుల చికిత్సలో నైపుణ్యాన్ని సాధించారు. కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ స్పెషలైజేషన్ సహకారంతో కువైట్లోని చాలా మంది వైద్యులు, నిపుణులకు శిక్షణ ఇచ్చారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ పండిత కువైట్లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ వైద్యులకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ కువైట్ మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







