కువైట్లో 32 ఏళ్లపాటు సేవలు.. డాక్టర్ రమేష్ పండితకు ఘన సత్కారం..!!
- September 19, 2024
కువైట్: ఇటీవలే కువైట్ ఆరోగ్య సంరక్షణ రంగానికి విశేషమైన సేవలందించినందుకు ప్రఖ్యాత భారతీయ వైద్యుడు, డాక్టర్ రెమేష్ పండితను కువైట్ ఆరోగ్య మంత్రి, డాక్టర్ అహ్మద్ అల్-అవధి ఘనంగా సత్కరించారు. మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్-ముతైరీ హాజరయ్యారు. డాక్టర్ పండిత పదవీ విరమణ సందర్భంగా మూడు దశాబ్దాల సేవలకు గుర్తుగా జ్ఞాపికను అందజేశారు.
డాక్టర్ పండిత, 1977లో భారతదేశంలోని కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు. 1982లో చండీగఢ్లోని PGIMER నుండి MD పట్టా పొందారు. కువైట్ క్యాన్సర్ నియంత్రణ కేంద్రంలో హేమటాలజీ విభాగంలో చేరారు. అక్కడ అతను 32 సంవత్సరాలు పనిచేశారు. తన కెరీర్ లో లుకేమియా, మైలోమాపై ప్రత్యేక దృష్టి సారించి, బ్లడ్ క్యాన్సర్ రోగుల చికిత్సలో నైపుణ్యాన్ని సాధించారు. కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ స్పెషలైజేషన్ సహకారంతో కువైట్లోని చాలా మంది వైద్యులు, నిపుణులకు శిక్షణ ఇచ్చారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ పండిత కువైట్లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ వైద్యులకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ కువైట్ మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







