యాక్షన్ మోడ్కి సిద్ధమవుతున్న ‘హరిహర వీరమల్లు’.!
- September 20, 2024
అటకెక్కేసిందనుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం మళ్లీ పట్టాలెక్కుతోంది. క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ మధ్యలో నిర్మాత ఏ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ చేతికి వెళ్లింది.
అప్పట్లో క్రిష్కీ, పవన్ కళ్యాణ్కీ, కాదు కాదు నిర్మాతతో క్రిష్కి ఏవో అభిప్రాయ బేధాలు రావడంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో, ఏ.ఎమ్,రత్నం తనయుడు, ‘7జీ బృందావన కాలనీ’ సినిమా హీరో అయిన జ్యోతి కృష్ణ దర్శకుడి హోదాలో ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యతను చేపట్టాడు.
ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఓ బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారట. అందుకోసం ప్రముఖ హాలీవుడ్ కొరియెగ్రఫర్లను ఎంగేజ్ చేశారట. మొగలాయిల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!









