యాక్షన్ మోడ్కి సిద్ధమవుతున్న ‘హరిహర వీరమల్లు’.!
- September 20, 2024
అటకెక్కేసిందనుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం మళ్లీ పట్టాలెక్కుతోంది. క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ మధ్యలో నిర్మాత ఏ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ చేతికి వెళ్లింది.
అప్పట్లో క్రిష్కీ, పవన్ కళ్యాణ్కీ, కాదు కాదు నిర్మాతతో క్రిష్కి ఏవో అభిప్రాయ బేధాలు రావడంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో, ఏ.ఎమ్,రత్నం తనయుడు, ‘7జీ బృందావన కాలనీ’ సినిమా హీరో అయిన జ్యోతి కృష్ణ దర్శకుడి హోదాలో ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యతను చేపట్టాడు.
ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఓ బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారట. అందుకోసం ప్రముఖ హాలీవుడ్ కొరియెగ్రఫర్లను ఎంగేజ్ చేశారట. మొగలాయిల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







