యాక్షన్ మోడ్కి సిద్ధమవుతున్న ‘హరిహర వీరమల్లు’.!
- September 20, 2024
అటకెక్కేసిందనుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం మళ్లీ పట్టాలెక్కుతోంది. క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ మధ్యలో నిర్మాత ఏ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ చేతికి వెళ్లింది.
అప్పట్లో క్రిష్కీ, పవన్ కళ్యాణ్కీ, కాదు కాదు నిర్మాతతో క్రిష్కి ఏవో అభిప్రాయ బేధాలు రావడంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో, ఏ.ఎమ్,రత్నం తనయుడు, ‘7జీ బృందావన కాలనీ’ సినిమా హీరో అయిన జ్యోతి కృష్ణ దర్శకుడి హోదాలో ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యతను చేపట్టాడు.
ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఓ బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారట. అందుకోసం ప్రముఖ హాలీవుడ్ కొరియెగ్రఫర్లను ఎంగేజ్ చేశారట. మొగలాయిల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!