ఈ సారి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: హర్మన్ప్రీత్ కౌర్
- September 25, 2024
యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ 2024 జరగనుంది. వచ్చే నెల 3 నుంచి అంటే.. మరో 9 రోజుల్లో ఈ మెగా కప్కు తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్కు సన్నద్ధమైన భారత మహిళల జట్టు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్ గెలవని టీమిండియా టైటిల్ నిరీక్షణకు తెరదించాలని చూస్తున్నది. ఈ సారి కచ్చితంగా టైటిల్ గెలుస్తామని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ దీమా వ్యక్తం చేసింది.యూఏఈకి బయల్దేరే ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరన్స్లో హర్మన్ప్రీత్.. పలు విషయాల గురించి మాట్లాడింది. ‘ఈ సారి టైటిల్ ఎత్తడానికి ఏం కావాలో అన్నీ మా దగ్గర ఉన్నాయి. 2020లో ఫైనల్కు చేరుకున్నాయి. గతేడాది తృటిలో ఫైనల్ను మిస్ అయ్యాం. అతిపెద్ద వేదికపై మేము ఏ విధంగా సత్తాచాటుతున్నామో చెప్పడానికి ఇదే నిదర్శనం. జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్లు ఏం చేయగలరో, వాళ్ల సామర్థ్యమేంటో నాకు తెలుసు. పేసర్లు పూజ వస్త్రాకర్, రేణుక సింగ్ ఫామ్లో ఉన్నారు. ఆల్రౌండర్ అరుంధతి రెడ్డి జట్టు కోసం ఎల్లప్పుడూ బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది’ అని తెలిపింది.అలాగే, తాను 19 ఏళ్ల వయసులో తొలి టీ20 ప్రపంచకప్ ఆడినప్పుడు ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నానో, ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఉన్నానని తెలిపింది. అయితే, ఇప్పుడు అనుభవం కూడా తోడైందని, ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసునని చెప్పింది. ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడటంపైనే దృష్టి పెట్టానని, స్వేచ్ఛగా ఆడుతూ క్రికెట్ను ఆస్వాదిస్తే తాను చాలా విషయాలను మార్చగలనని చెప్పుకొచ్చింది. యూఏఈ పరిస్థితుల గురించి మాట్లాడుతూ..‘చాలా వరకు మ్యాచ్లు రాత్రి జరగనున్నాయి. కాబట్టి, మంచు ప్రభావం ఉంటుంది. మాకు మంచి స్పిన్నర్లతోపాటు పూజ, రేణుక ఉన్నారు’ అని తెలిపింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







