ఏపీ మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ - మంత్రి కొల్లు రవీంద్ర
- October 01, 2024
ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసింది.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెండు రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తాం.. ఏ జిల్లాలో ఎన్ని షాపులు అనే వివరాలు వస్తాయని చెప్పారు. 7 రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చు.. మధ్యలో 2 రోజులు సెలవులు వస్తున్నాయి.. పదో రోజున డ్రా తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2 లక్షలు ఒక దరఖాస్తు ఫీజు.. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు ఎన్నైనా వేయవచ్చన్నారు.
డ్రాలో పేర్లు వచ్చిన వారు లైసెన్స్ ఫీజులు 4 స్లాబులో రకాలుగా ఉన్నాయి.. స్లాబులు ఏరియా బట్టి నిర్ణయం ఉంటుంది.. ఇవి 6 వాయిదాలలో కట్టుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అన్ని బ్రాండ్లు అందే విధంగా పారదర్శకంగా అందిస్తున్నాం.. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని సామాన్యులకు అందిస్తున్నాం.. గత ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ వారిని సెబ్ పేరుతో విడగొట్టారని తెలిపారు. ఇప్పుడు రెండింటినీ కలుపుతూ నిర్ణయం తీసుకున్నాం.. సీనరేజ్ చార్జి కట్టి లోడింగ్ అన్ లోడింగ్ కడితే పట్టా ల్యాండ్లో సాండ్ తీసుకోవచ్చని మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!