బ్యాంకాక్లో ఘోరం.. స్కూల్ బస్సు మంటల్లో చిక్కుకొని 25 మంది చిన్నారులు మృతి
- October 01, 2024
థాయ్ల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్ను తీసుకెళుతున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకొంది.
సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగివస్తుండగా జరిగిన ఈ ఘటనలో మొత్తం 25మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. థాయ్ల్యాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా మృతులకు సంతాపం తెలిపారు. విద్యార్థులు ట్రిప్కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
థాయ్ల్యాండ్ రవాణశాఖా మంత్రి ఈ ప్రమాదం వివరాలను వెల్లడించింది. ''మొత్తం 44 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. వీరిలో 38 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు ఉన్నారు. ఇప్పటివరకు 16 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను రక్షించారు. మిగిలిన వారి విషయంపై ఇంకా స్పష్టత లేదు'' అని పేర్కొన్నారు. ఇటీరియర్ మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ మాట్లాడుతూ మృతుల సంఖ్యను ఇంకా ధ్రువీకరించలేమని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన వారి సంఖ్య ఆధారంగా.. 25 మంది చనిపోయి ఉండొచ్చన్నారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా.. మృతదేహాలు ఇంకా బస్సులోనే ఉండిపోవడం గమనార్హం.
ఈ ప్రమాదంపై ఆన్లైన్లో పోస్టు అయిన వీడియోల్లో బస్సు నుంచి నల్లటి పొగ, భారీగా మంటలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల వయస్సు ఇతర వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఒక టైరు పేలిపోయినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ సంస్థ తాము 10కిపైగా మృతదేహాలను చూసినట్లు ఫేస్బుక్లో పేర్కొంది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







