కథ సుఖాంతం..మూడేళ్ల తర్వాత కుటుంబంతో కలిసి స్వదేశానికి ప్రవాసుడు..!!
- October 02, 2024
యూఏఈ: యూఏఈలో మూడేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి కథ సుఖాంతం అయింది. తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతూ యూఏఈకి వచ్చిన కుటుంబంతో కలిసి స్వదేశానికి బయలుదేరాడు. నిర్మాణ రంగ కార్మికుడు సంజయ్ మోతీలాల్ పర్మార్( 53) అక్టోబర్ 2న తన భార్య కోమల్ , కుమారుడు ఆయుష్తో కలిసి గుజరాత్లోని సూరత్కు వెళ్లనున్నారు. వారు క్షమాభిక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఎగ్జిట్ పాస్ పొందారు. "ఇది జీవితంలో రెండవ అవకాశంగా అనిపిస్తుంది. ఇది ఒక కలగా అనిపిస్తుంది. " అని సంజయ్ అన్నారు.
తన భర్తను వెతుక్కుంటూ కోమల్ , ఆయుష్ సెప్టెంబర్ 8న యూఏఈకి వచ్చారు. సెప్టెంబర్ 19న సంజయ్ చిరునామాను గుర్తించారు. అబుదాబికి చెందిన పాకిస్తానీ ఎటిసలాట్ సాంకేతిక నిపుణుడు అలీ హస్నైన్ వద్ద ఆశ్రయం పొందుతున్న సంజయ్ ని కుటుంబసభ్యులు కలుసుకున్నారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!