కథ సుఖాంతం..మూడేళ్ల తర్వాత కుటుంబంతో కలిసి స్వదేశానికి ప్రవాసుడు..!!
- October 02, 2024
యూఏఈ: యూఏఈలో మూడేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి కథ సుఖాంతం అయింది. తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతూ యూఏఈకి వచ్చిన కుటుంబంతో కలిసి స్వదేశానికి బయలుదేరాడు. నిర్మాణ రంగ కార్మికుడు సంజయ్ మోతీలాల్ పర్మార్( 53) అక్టోబర్ 2న తన భార్య కోమల్ , కుమారుడు ఆయుష్తో కలిసి గుజరాత్లోని సూరత్కు వెళ్లనున్నారు. వారు క్షమాభిక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఎగ్జిట్ పాస్ పొందారు. "ఇది జీవితంలో రెండవ అవకాశంగా అనిపిస్తుంది. ఇది ఒక కలగా అనిపిస్తుంది. " అని సంజయ్ అన్నారు.
తన భర్తను వెతుక్కుంటూ కోమల్ , ఆయుష్ సెప్టెంబర్ 8న యూఏఈకి వచ్చారు. సెప్టెంబర్ 19న సంజయ్ చిరునామాను గుర్తించారు. అబుదాబికి చెందిన పాకిస్తానీ ఎటిసలాట్ సాంకేతిక నిపుణుడు అలీ హస్నైన్ వద్ద ఆశ్రయం పొందుతున్న సంజయ్ ని కుటుంబసభ్యులు కలుసుకున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









