కథ సుఖాంతం..మూడేళ్ల తర్వాత కుటుంబంతో కలిసి స్వదేశానికి ప్రవాసుడు..!!
- October 02, 2024
యూఏఈ: యూఏఈలో మూడేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి కథ సుఖాంతం అయింది. తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతూ యూఏఈకి వచ్చిన కుటుంబంతో కలిసి స్వదేశానికి బయలుదేరాడు. నిర్మాణ రంగ కార్మికుడు సంజయ్ మోతీలాల్ పర్మార్( 53) అక్టోబర్ 2న తన భార్య కోమల్ , కుమారుడు ఆయుష్తో కలిసి గుజరాత్లోని సూరత్కు వెళ్లనున్నారు. వారు క్షమాభిక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఎగ్జిట్ పాస్ పొందారు. "ఇది జీవితంలో రెండవ అవకాశంగా అనిపిస్తుంది. ఇది ఒక కలగా అనిపిస్తుంది. " అని సంజయ్ అన్నారు.
తన భర్తను వెతుక్కుంటూ కోమల్ , ఆయుష్ సెప్టెంబర్ 8న యూఏఈకి వచ్చారు. సెప్టెంబర్ 19న సంజయ్ చిరునామాను గుర్తించారు. అబుదాబికి చెందిన పాకిస్తానీ ఎటిసలాట్ సాంకేతిక నిపుణుడు అలీ హస్నైన్ వద్ద ఆశ్రయం పొందుతున్న సంజయ్ ని కుటుంబసభ్యులు కలుసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!
- రియాద్ మీదుగా డ్రోన్లతో ఇరాన్ అటాక్..అడ్డుకున్న ఢిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!









