లెబనాన్, పాలస్తీనాలో ఉద్రిక్తత..అంతర్జాతీయ చర్య కోసం GCC మంత్రుల పిలుపు..!!
- October 04, 2024
మనామా: ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ అధ్యక్షతన దోహాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) మంత్రిత్వ మండలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో సహా అన్ని GCC సభ్య దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. లెబనాన్, పాలస్తీనాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రాంతీయ శాంతికి మాత్రమే కాకుండా ప్రపంచ భద్రత, స్థిరత్వానికి కూడా ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. హింసను తక్షణమే నిలిపివేయాలని GCC మంత్రులు పిలుపునిచ్చారు. తీవ్రతను తగ్గించడానికి ముందుకురావాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ప్రాంతీయ భద్రతను పరిరక్షించి, ఘర్షణ వ్యాప్తి చెందకుండా నిరోధించాలని వారు కోరారు. ఈ ప్రాంతాన్ని సుస్థిరపరచడానికి ఉద్దేశించిన సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు చేయడానికి అంతర్జాతీయ సమాజం బాధ్యతను కూడా కౌన్సిల్ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









