లెబనాన్, పాలస్తీనాలో ఉద్రిక్తత..అంతర్జాతీయ చర్య కోసం GCC మంత్రుల పిలుపు..!!
- October 04, 2024
మనామా: ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ అధ్యక్షతన దోహాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) మంత్రిత్వ మండలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో సహా అన్ని GCC సభ్య దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. లెబనాన్, పాలస్తీనాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రాంతీయ శాంతికి మాత్రమే కాకుండా ప్రపంచ భద్రత, స్థిరత్వానికి కూడా ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. హింసను తక్షణమే నిలిపివేయాలని GCC మంత్రులు పిలుపునిచ్చారు. తీవ్రతను తగ్గించడానికి ముందుకురావాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ప్రాంతీయ భద్రతను పరిరక్షించి, ఘర్షణ వ్యాప్తి చెందకుండా నిరోధించాలని వారు కోరారు. ఈ ప్రాంతాన్ని సుస్థిరపరచడానికి ఉద్దేశించిన సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు చేయడానికి అంతర్జాతీయ సమాజం బాధ్యతను కూడా కౌన్సిల్ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







