లెబనాన్, పాలస్తీనాలో ఉద్రిక్తత..అంతర్జాతీయ చర్య కోసం GCC మంత్రుల పిలుపు..!!
- October 04, 2024
మనామా: ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ అధ్యక్షతన దోహాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) మంత్రిత్వ మండలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో సహా అన్ని GCC సభ్య దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. లెబనాన్, పాలస్తీనాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రాంతీయ శాంతికి మాత్రమే కాకుండా ప్రపంచ భద్రత, స్థిరత్వానికి కూడా ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. హింసను తక్షణమే నిలిపివేయాలని GCC మంత్రులు పిలుపునిచ్చారు. తీవ్రతను తగ్గించడానికి ముందుకురావాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ప్రాంతీయ భద్రతను పరిరక్షించి, ఘర్షణ వ్యాప్తి చెందకుండా నిరోధించాలని వారు కోరారు. ఈ ప్రాంతాన్ని సుస్థిరపరచడానికి ఉద్దేశించిన సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు చేయడానికి అంతర్జాతీయ సమాజం బాధ్యతను కూడా కౌన్సిల్ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







