నిధుల దుర్వినియోగం..ఫైనాన్షియల్ సంస్థకు 2.6 మిలియన్ దిర్హామ్ల జరిమానా..!!
- October 04, 2024
దుబాయ్: తమ విధానాలను ఉల్లంఘించినందుకు క్లయింట్ ఫండ్ దుర్వినియోగం చేసిన ఓ ఫైనాన్షియల్ సంస్థకు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ భారీ జరిమానా విధించింది. OCS ఇంటర్నేషనల్ ఫైనాన్స్ లిమిటెడ్ Dh168,800 ($46 మిలియన్) క్లయింట్ ఫండ్లను దుర్వినియోగం చేసిందని ఆడిట్ లో గుర్తించారు. అథారిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కంపెనీకి Dh2,645,721 ($720,905) జరిమానా విధించారు. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు Dh682,631 ($186,000) జరిమానా విధించారు. దాంతోపాటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో లేదా దాని నుండి ఆర్థిక సేవలను అందించడానికి సంబంధించిన ఏదైనా ఫంక్షన్లో పాల్గొనకుండా కూడా పరిమితం చేసినట్టు DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ తెలిపారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కొనసాగించడానికి DIFCలో ఆర్థిక సేవల సమగ్రతను కాపాడుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేలా నిర్ణయాత్మక చర్యలకు వెనుకాడబోమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







