మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తికి జైలుశిక్ష, Dh100,000 జరిమానా..!!
- October 04, 2024
దుబాయ్: మాదకద్రవ్యాలు తీసుకొని డ్రైవింగ్ చేసి, తీవ్ర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన దుబాయ్ వాహనదారుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, Dh100,000 జరిమానాను విధిస్తూ దుబాయ్ ట్రాఫిక్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సైకోట్రోపిక్ పదార్థాలను సేవించడం, మద్యం సేవించి వాహనం నడపడం, గడువు ముగిసిన లైసెన్స్తో పబ్లిక్ రోడ్డుపై బీమా లేని వాహనాన్ని నడపడం వంటి నేరాలకు నిందితుడిని దోషీగా నిర్ధారించారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అతని జైలు శిక్ష పూర్తయిన తర్వాత, డ్రైవర్ దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో యూఏఈ సెంట్రల్ బ్యాంక్ అనుమతి లేకుండా వ్యక్తిగతంగా లేదా మరొకరి ద్వారా ఇతరులకు డబ్బు బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయడంపై అధికారులు నిషేధం విధించారు. వాహన డ్రైవర్లందరూ మాదకద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్ చేయకుండా మరియు ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ అధిపతి, కౌన్సెలర్ సలాహ్ బు ఫరూషా అల్ ఫలాసి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!









