20 మిలియన్ దిర్హామ్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న డెలివరీ రైడర్..!!
- October 04, 2024
యూఏఈ: తాజా బిగ్ టికెట్ డ్రాతో బంగ్లాదేశ్ డెలివరీ రైడర్ 20 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. అబుదాబిలో ఉన్న 50 ఏళ్ల అబుల్ మోన్సూర్ అబ్దుల్ సబుర్.. 2007 నుండి బిగ్ టిక్కెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నాడు. తాజా ఎడిషన్లో అతను, అతని స్నేహితులు ఐదు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అందులో ఒకటి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచారన్న కాల్ని అందుకున్న తర్వాత అబుల్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. సంతోషంతో ఏడ్చినట్టు తెలిపాడు. ప్రతి నెలా గెలుస్తానన్న నమ్మకంతో టిక్కెట్లు కొంటున్నట్టు తెలిపాడు. వచ్చే బహుమతి మొత్తంతో స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..









