రాజకీయ పార్టీలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చేదే అలయ్ బలయ్
- October 07, 2024
హైదరాబాద్: రాజకీయ పార్టీలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావడమే అలయ్ బలయ్ లక్ష్యమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దత్తాత్రేయ నేతృత్వంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ప్రతియేటా దసరా సందర్భంగా తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు. ఈ ఏడాదితో అలయ్ బలయ్కు 19 ఏళ్లు పూర్తయిందన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో విడివిడిగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి, ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళే ఉద్దేశంతో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
పరస్పర విబేధాలు లేకుండా అందరూ కలుసుకునే ఆత్మీయ సమ్మేళనమే అలయ్ బలయ్ అన్నారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఆహారపు అలవాట్లను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అన్ని పార్టీల ప్రముఖ లీడర్లకు ఆహ్వానాలు పంపామని, ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు- చేశామని వెల్లడించారు. అందరినీ కలుపుకొని పోవడమే అలయ్ బలయ్ ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









