అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలు..2 బిలియన్ దిర్హామ్ల ఆస్తులు సీజ్..!!
- October 10, 2024
యూఏఈ: మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి యూఏఈ అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలపై నిఘాను పెంచింది. 2023లో 2 బిలియన్ దిర్హామ్ల కంటే ఎక్కువ విలువైన నిధులు, ఆస్తుల జప్తు చేసినట్టు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మొహమ్మద్ బాలమా తెలిపారు. అబుదాబిలో జరిగిన ఆర్థిక నేరాల జాతీయ సమ్మిట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఏఈ తన ఆర్థిక రంగం సమర్థత, సమగ్రతను కాపాడుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని అన్నారు. యూఏఈ రెగ్యులేటరీ అధికారులు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారని, 2022లో Dh80 మిలియన్లతో పోలిస్తే, 250 మిలియన్ల కంటే ఎక్కువ ఆర్థిక ఆంక్షలు విధించినట్టు ఆయన వివరించారు. ఫైనాన్షియల్ సెక్టార్లోని లావాదేవీల పర్యవేక్షణ 2023లో మూడు రెట్లు పెరిగిందని గవర్నర్ తెలిపారు. గత సంవత్సరం మొత్తం దాదాపు 15,000 నియంత్రిత సంస్థలు, కంపెనీలలో 4వేల తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇటీవల, యూఏఈ 2024-2027 సంవత్సరాలకు మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









