అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలు..2 బిలియన్ దిర్హామ్ల ఆస్తులు సీజ్..!!
- October 10, 2024
యూఏఈ: మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి యూఏఈ అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలపై నిఘాను పెంచింది. 2023లో 2 బిలియన్ దిర్హామ్ల కంటే ఎక్కువ విలువైన నిధులు, ఆస్తుల జప్తు చేసినట్టు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మొహమ్మద్ బాలమా తెలిపారు. అబుదాబిలో జరిగిన ఆర్థిక నేరాల జాతీయ సమ్మిట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఏఈ తన ఆర్థిక రంగం సమర్థత, సమగ్రతను కాపాడుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని అన్నారు. యూఏఈ రెగ్యులేటరీ అధికారులు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారని, 2022లో Dh80 మిలియన్లతో పోలిస్తే, 250 మిలియన్ల కంటే ఎక్కువ ఆర్థిక ఆంక్షలు విధించినట్టు ఆయన వివరించారు. ఫైనాన్షియల్ సెక్టార్లోని లావాదేవీల పర్యవేక్షణ 2023లో మూడు రెట్లు పెరిగిందని గవర్నర్ తెలిపారు. గత సంవత్సరం మొత్తం దాదాపు 15,000 నియంత్రిత సంస్థలు, కంపెనీలలో 4వేల తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇటీవల, యూఏఈ 2024-2027 సంవత్సరాలకు మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







