టెస్లా నుంచి విడుదలైన డ్రైవర్ లెస్ రోబో టాక్సీ ఎలా ఉందో తెలుసా..?
- October 11, 2024
భవిష్యత్ యుగమంతా రోబోలదే అదే అని చెప్పిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల డ్రైవర్ లెస్ రోబో టాక్సీని విడుదల చేశారు, దీనికి ‘సైబర్ క్యాబ్’ అని నామకరణం అని కూడా చేశారు. ఈ వాహనం ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా ఆటోమేటిక్, అంటే స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఏమీ ఉండవు. ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టంతో ఈ రోబో ని తయారు చేశారు.
ఈ వాహనాన్ని కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో నిర్వహించిన ‘వీరోబో’ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అయితే సైబర్ క్యాబ్ 2026 నుండి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ వాహనం ధర సుమారు 30,000 డాలర్లలోపు ఉంటుందని అంచనా. ఆటోమేటిక్ కార్లు సాధారణ కార్ల కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువగా వాడుకోవచ్చని ఎలాన్ మస్క్ తెలిపారు.
ఈ వాహనం రైలు ఇంజిన్ వంటి డిజైన్తో తయారు చేయబడింది. చక్రాలు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు, ఇది భూమికి తక్కువ ఎత్తులో ఉంటుంది. రోబో టాక్సీ మోడల్ సాధారణ డిజైన్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది 20 మంది ప్రయాణికులను లేదా సరుకులను తరలించడానికి ఉపయోగపడుతుంది.
టెస్లా ఈ రోబో టాక్సీని 2019లో ప్రకటించినప్పటికీ, 2020 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావించారు. కానీ, నాణ్యతను మెరుగుపరచడం కోసం ఆలస్యమైందని మస్క్ తెలిపారు. చివరికి, 2024లో ఈ మోడల్ను ఆవిష్కరించారు.
ఈ రోబో టాక్సీ టెస్లా యొక్క సాంకేతికతను మరియు వినూత్నతను ప్రతిబింబిస్తుంది. ఇది భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఎలాన్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









