ఎడతెరిపి లేని వానలకు తమిళనాడు విలవిల.. డ్రోన్లతో ఆహారం సరఫరా
- October 17, 2024
తమిళనాడు: తమిళనాడులోని పలు జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. తిరుపూర్లోని వీరపాండి, గాంధీనగర్, అంగేరిపాళ్యం, పాళంగేరి, నల్లూర్ తదితర ప్రాంతాల్లో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు బుధవారం రాస్తారోకో చేశారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విరమించుకున్నారు. వర్షపునీరు చేరిన ఇళ్లలోని ప్రజలను పక్కనే ఉన్న సామాజిక భవనాలకు తరలించారు.
భారీ వర్షాలతో చెన్నైలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వనలు తగ్గకపోవడంతో వరదలు వస్తాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వాహనాలను ఫ్లై ఓవర్ ల మీద పార్క్ చేస్తున్నారు. ఇప్పటికే రెండువైపులా కార్లు బారులు తీరాయి. వరదలకు భయపడి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన చాలామంది ఇలా వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. ఇదే పద్ధతిని చెన్నై వాసులు ఫాలో అవుతున్నారు. ఇక టూ వీలర్స్ ను యజమానులు తమ ప్లాట్లో పార్క్ చేసుకుంటున్నారు.
చెన్నై నగరంలో సత్వర సహాయానికి అధికారులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బందితో రంగంలోకి దిగారు. నేపథ్యంలో బోట్లు వెళ్లలేని ప్రాంతాల్లో బాధితులకు అత్యవసర వస్తువులను తరలింపునకు మహానగర చెన్నై కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు 3 డ్రోన్లు సిద్ధం చేసింది. వాటి ద్వారా పాలు, రొట్టె, మందులు తదితర సుమారు 5 నుంచి 10 కిలోల బరువున్న ఆహార పదార్థాలను తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







