ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఎమిరేటీ యువకుల మృతి
- June 22, 2016
ఇద్దరు ఎమిరేటి యువకులు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన రస్ అల్ ఖైమాలో జరిగింది. అజాన్ రోడ్లో ఓ కారు ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం అందినట్లు అల్ దిక్దాకా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ డైరెక్టర్ ఫస్ట్ లెఫ్టినెంట్ ఇబ్రహీమ్ సైఫ్ అల్ మజ్రోయి చెప్పారు. వెంటనే, ప్రమాద స్థలానికి చేరుకున్నామని, ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడనీ, గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రమాద తీవ్రత కారణంగా కారులోని ముగ్గురు యువకులు బయటకు విసిరివేయబడ్డారు. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తికి లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అల్ మజ్రోయి ఈ సందర్భంగా అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







