ఈషా ఫౌండేషన్ కు భారీ ఊరట
- October 18, 2024
న్యూ ఢిల్లీ: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ పై దాఖలైన చట్టవిరుద్ధ నిర్బంధం కేసు విచారణను సుప్రీంకోర్టు నేడు నిలిపివేసింది. అంతకుముందు అక్టోబర్ 3న, ఫౌండేషన్పై పోలీసుల విచారణకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది.
వివరాలలోకి వెళితే , ఫౌండేషన్పై రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమార్తెలు లత, గీతలను ఆశ్రమంలో బందీలుగా ఉంచారని ఆరోపించారు. దీనిపై సెప్టెంబర్ 30న ఇషా ఫౌండేషన్కు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 1న దాదాపు 150 మంది పోలీసులు ఫౌండేషన్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాన్ని సద్గురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.. ఆ రోజునే విచారణను అక్టోబర్ 18 తేదీకి వేసింది.. నేడు విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు .
ఈ కేసు విషయంలో “ఈషా ఫౌండేషన్లో ఉంటున్న ఇద్దరి మహిళలతో తాము మాట్లాడామని, వారు స్వచ్చందంగానే అక్కడ ఉంటున్నట్లు తెలిపారని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వెల్లడించారు.. దీంతో ఈ కేసులో హేబియస్ కార్పస్ వర్తించదని చెబుతూ, ఈ కేసును ఇంతటితో ముగిస్తునట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









