ఈషా ఫౌండేషన్ కు భారీ ఊరట
- October 18, 2024
న్యూ ఢిల్లీ: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ పై దాఖలైన చట్టవిరుద్ధ నిర్బంధం కేసు విచారణను సుప్రీంకోర్టు నేడు నిలిపివేసింది. అంతకుముందు అక్టోబర్ 3న, ఫౌండేషన్పై పోలీసుల విచారణకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది.
వివరాలలోకి వెళితే , ఫౌండేషన్పై రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమార్తెలు లత, గీతలను ఆశ్రమంలో బందీలుగా ఉంచారని ఆరోపించారు. దీనిపై సెప్టెంబర్ 30న ఇషా ఫౌండేషన్కు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 1న దాదాపు 150 మంది పోలీసులు ఫౌండేషన్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాన్ని సద్గురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.. ఆ రోజునే విచారణను అక్టోబర్ 18 తేదీకి వేసింది.. నేడు విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు .
ఈ కేసు విషయంలో “ఈషా ఫౌండేషన్లో ఉంటున్న ఇద్దరి మహిళలతో తాము మాట్లాడామని, వారు స్వచ్చందంగానే అక్కడ ఉంటున్నట్లు తెలిపారని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వెల్లడించారు.. దీంతో ఈ కేసులో హేబియస్ కార్పస్ వర్తించదని చెబుతూ, ఈ కేసును ఇంతటితో ముగిస్తునట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







