ఒమన్ ఫుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు.. OMR 45 మిలియన్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు..!!
- October 18, 2024
మస్కట్: నాల్గవ ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ తన కార్యకలాపాలను విజయవంతంగా ముగించింది. OMR 45 మిలియన్ కంటే ఎక్కువ విలువైన వివిధ రంగాలలో 41 పెట్టుబడి ప్రాజెక్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ల ద్వారా 66 పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ల్యాబ్ ఆహార భద్రతా రంగంలో ప్రాజెక్ట్లకు మద్దతు ఇవ్వడానికి, లాజిస్టిక్స్ సేవలను మెరుగుపరచడానికి "తారావత్" , "జాద్" ప్లాట్ఫారమ్లను ప్రారంభించేందుకు 24 ప్రారంభ కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ముగింపు వేడుకలో మత్స్య రంగంలో OMR 36.8 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన 14 పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒమన్ గవర్నరేట్లలో 13,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 177 ఒప్పందాలు వ్యవసాయ పెట్టుబడి ప్రాజెక్టుల కోసం కుదిరాయి. వీటి మొత్తం విలువ OMR 32.3 మిలియన్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక