ఒమన్ ఫుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు.. OMR 45 మిలియన్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు..!!
- October 18, 2024
మస్కట్: నాల్గవ ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ తన కార్యకలాపాలను విజయవంతంగా ముగించింది. OMR 45 మిలియన్ కంటే ఎక్కువ విలువైన వివిధ రంగాలలో 41 పెట్టుబడి ప్రాజెక్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ల ద్వారా 66 పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ల్యాబ్ ఆహార భద్రతా రంగంలో ప్రాజెక్ట్లకు మద్దతు ఇవ్వడానికి, లాజిస్టిక్స్ సేవలను మెరుగుపరచడానికి "తారావత్" , "జాద్" ప్లాట్ఫారమ్లను ప్రారంభించేందుకు 24 ప్రారంభ కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ముగింపు వేడుకలో మత్స్య రంగంలో OMR 36.8 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన 14 పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒమన్ గవర్నరేట్లలో 13,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 177 ఒప్పందాలు వ్యవసాయ పెట్టుబడి ప్రాజెక్టుల కోసం కుదిరాయి. వీటి మొత్తం విలువ OMR 32.3 మిలియన్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









