ఒమన్ ఫుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు.. OMR 45 మిలియన్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు..!!
- October 18, 2024
మస్కట్: నాల్గవ ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ తన కార్యకలాపాలను విజయవంతంగా ముగించింది. OMR 45 మిలియన్ కంటే ఎక్కువ విలువైన వివిధ రంగాలలో 41 పెట్టుబడి ప్రాజెక్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ల ద్వారా 66 పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ల్యాబ్ ఆహార భద్రతా రంగంలో ప్రాజెక్ట్లకు మద్దతు ఇవ్వడానికి, లాజిస్టిక్స్ సేవలను మెరుగుపరచడానికి "తారావత్" , "జాద్" ప్లాట్ఫారమ్లను ప్రారంభించేందుకు 24 ప్రారంభ కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ముగింపు వేడుకలో మత్స్య రంగంలో OMR 36.8 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన 14 పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒమన్ గవర్నరేట్లలో 13,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 177 ఒప్పందాలు వ్యవసాయ పెట్టుబడి ప్రాజెక్టుల కోసం కుదిరాయి. వీటి మొత్తం విలువ OMR 32.3 మిలియన్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







