ఒమన్ ఫుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు.. OMR 45 మిలియన్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు..!!
- October 18, 2024
మస్కట్: నాల్గవ ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ తన కార్యకలాపాలను విజయవంతంగా ముగించింది. OMR 45 మిలియన్ కంటే ఎక్కువ విలువైన వివిధ రంగాలలో 41 పెట్టుబడి ప్రాజెక్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ల ద్వారా 66 పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ల్యాబ్ ఆహార భద్రతా రంగంలో ప్రాజెక్ట్లకు మద్దతు ఇవ్వడానికి, లాజిస్టిక్స్ సేవలను మెరుగుపరచడానికి "తారావత్" , "జాద్" ప్లాట్ఫారమ్లను ప్రారంభించేందుకు 24 ప్రారంభ కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ముగింపు వేడుకలో మత్స్య రంగంలో OMR 36.8 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన 14 పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒమన్ గవర్నరేట్లలో 13,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 177 ఒప్పందాలు వ్యవసాయ పెట్టుబడి ప్రాజెక్టుల కోసం కుదిరాయి. వీటి మొత్తం విలువ OMR 32.3 మిలియన్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







