సౌదీ ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్.. 209,500 మంది ప్రవాస కార్మికులకు గుర్తింపు..!!
- October 21, 2024
రియాద్: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సౌదీ ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,000 వృత్తులలో 209,500 కంటే ఎక్కువ మంది కార్మికులకు గుర్తింపు మంజూరు చేశారు. కార్మిక మార్కెట్ అవుట్పుట్ నాణ్యతను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ నిరంతర ప్రయత్నాలలో భాగమైన ఈ కార్యక్రమం.. ప్రవాస కార్మికుడిలో అవసరమైన నైపుణ్యాలు, అర్హతలను కలిగి ఉండేలా చూస్తుంది. ప్రోగ్రామ్లో "ప్రొఫెషనల్ వెరిఫికేషన్", "ప్రొఫెషనల్ ఇన్స్పెక్షన్" సేవలు ఉన్నాయి. ఈ "ప్రొఫెషనల్ వెరిఫికేషన్" సేవ ప్రవాస కార్మికుల నైపుణ్యాలు, అనుభవాలు, ధృవపత్రాలను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్. గరిష్టంగా 15 పని దినాల ప్రాసెసింగ్ సమయంతో యూనిఫైడ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ద్వారా నిర్ధారిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 127 కంటే ఎక్కువ ప్రొఫెషనల్ పరీక్షా కేంద్రాల ద్వారా ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







