సౌదీ ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్.. 209,500 మంది ప్రవాస కార్మికులకు గుర్తింపు..!!
- October 21, 2024
రియాద్: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సౌదీ ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,000 వృత్తులలో 209,500 కంటే ఎక్కువ మంది కార్మికులకు గుర్తింపు మంజూరు చేశారు. కార్మిక మార్కెట్ అవుట్పుట్ నాణ్యతను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ నిరంతర ప్రయత్నాలలో భాగమైన ఈ కార్యక్రమం.. ప్రవాస కార్మికుడిలో అవసరమైన నైపుణ్యాలు, అర్హతలను కలిగి ఉండేలా చూస్తుంది. ప్రోగ్రామ్లో "ప్రొఫెషనల్ వెరిఫికేషన్", "ప్రొఫెషనల్ ఇన్స్పెక్షన్" సేవలు ఉన్నాయి. ఈ "ప్రొఫెషనల్ వెరిఫికేషన్" సేవ ప్రవాస కార్మికుల నైపుణ్యాలు, అనుభవాలు, ధృవపత్రాలను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్. గరిష్టంగా 15 పని దినాల ప్రాసెసింగ్ సమయంతో యూనిఫైడ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ద్వారా నిర్ధారిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 127 కంటే ఎక్కువ ప్రొఫెషనల్ పరీక్షా కేంద్రాల ద్వారా ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









